స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో చింతకాయల రాము
స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో చింతకాయల రాము
Editor Desk
రింగ్ గుర్తుతో వార్డు అభివృద్ధి లక్ష్యం
వార్డు అభివృద్ధే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా చింతకాయల రాము రింగ్ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, పారదర్శకంగా సేవలందించడం, ప్రతి ఇంటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.ఇప్పటివరకు ప్రజలతో కలిసి చేసిన సేవలను కొనసాగిస్తూ, రాబోయే రోజుల్లో మరింత బాధ్యతతో పని చేస్తానని రాము స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వార్డు ప్రజలతో కలిసి సుమారు వంద మందికి పైగా పాల్గొన్నారు. ప్రజలు చింతకాయల రాముకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, వార్డు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో రింగ్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థి చింతకాయల రామును గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి