Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:30 AM

స్వగ్రామంలో న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌కు ఘన స్వాగతం. సర్పంచ్ సాయికుమార్ గౌడ్

స్వగ్రామంలో న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌కు ఘన స్వాగతం. సర్పంచ్ సాయికుమార్ గౌడ్

స్వగ్రామంలో న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌కు ఘన స్వాగతం. సర్పంచ్ సాయికుమార్ గౌడ్
February 01, 2026 08:12 PM 278 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పచ్చదనం–పరిశుభ్రతకు సందేశంగా మొక్కలు నాటిన ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో కోర్టు భవనాల శంకుస్థాపన అనంతరం హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ స్వగ్రామం బోగారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ పూల బొకేలతో న్యాయమూర్తులు సహా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు.

పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా బోగారం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు స్వయంగా మొక్కలు నాటి గ్రామస్థులకు పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ మొక్కలు మానవ జీవితానికి ప్రాణాధారం అని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షిస్తేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందుతుందని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలంటే, పాడిపంటలు పండాలంటే ప్రకృతిలో పచ్చదనం కీలకమని స్పష్టం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు బి. విజయసేనారెడ్డి, పి. శ్యామ్ కోసి, కే. శరత్, సృజన, కళాసికం, నర్సింగరావు నందికొండ, వాకిటి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా పోలీసు అధికారి అఖిలేష్ యాదవ్, సీనియర్ సివిల్ న్యాయాధికారి సబిత, జూనియర్ సివిల్ న్యాయాధికారి శిరీష హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News