Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:45 AM

స్వగ్రామంలో న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌కు ఘన స్వాగతం. సర్పంచ్ సాయికుమార్ గౌడ్

స్వగ్రామంలో న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌కు ఘన స్వాగతం. సర్పంచ్ సాయికుమార్ గౌడ్

స్వగ్రామంలో న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్‌కు ఘన స్వాగతం. సర్పంచ్ సాయికుమార్ గౌడ్
February 01, 2026 08:12 PM 274 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పచ్చదనం–పరిశుభ్రతకు సందేశంగా మొక్కలు నాటిన ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో కోర్టు భవనాల శంకుస్థాపన అనంతరం హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ స్వగ్రామం బోగారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ పూల బొకేలతో న్యాయమూర్తులు సహా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు.

పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా బోగారం గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు స్వయంగా మొక్కలు నాటి గ్రామస్థులకు పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ మొక్కలు మానవ జీవితానికి ప్రాణాధారం అని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షిస్తేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందుతుందని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలంటే, పాడిపంటలు పండాలంటే ప్రకృతిలో పచ్చదనం కీలకమని స్పష్టం చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు బి. విజయసేనారెడ్డి, పి. శ్యామ్ కోసి, కే. శరత్, సృజన, కళాసికం, నర్సింగరావు నందికొండ, వాకిటి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా పోలీసు అధికారి అఖిలేష్ యాదవ్, సీనియర్ సివిల్ న్యాయాధికారి సబిత, జూనియర్ సివిల్ న్యాయాధికారి శిరీష హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News