స్థానిక డిజిటల్ మీడియాపై ప్రజల అపూర్వ ఆదరణ డిజిటల్ యుగంలో స్థానిక వార్తలకు ప్రజలు ఇచ్చిన మద్దతు చరిత్రాత్మకం.
స్థానిక డిజిటల్ మీడియాపై ప్రజల అపూర్వ ఆదరణ డిజిటల్ యుగంలో స్థానిక వార్తలకు ప్రజలు ఇచ్చిన మద్దతు చరిత్రాత్మకం.
స్థానికం బృందం
కేవలం 16 రోజుల్లో లక్ష (100000) వ్యూస్ మైలురాయి
గ్రామీణ స్థాయి వార్తలకు పట్టం కట్టిన ప్రజలు
స్థానిక వార్తల ప్రాధాన్యతకు నిదర్శనం ఈ అపూర్వ ఆదరణ
స్థానిక వార్తలకు ఉన్న ప్రాముఖ్యతను చాటిచెబుతూ, 'స్థానికం' డిజిటల్ మీడియా అనతి కాలంలోనే అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంది. ప్రజల సమస్యలను, గొంతుకను నేరుగా ప్రపంచానికి వినిపించే లక్ష్యంతో ప్రారంభమైన మా ప్రయాణంలో, కేవలం 16 రోజుల్లోనే 1,00,000 (లక్ష) కు పైగా డిజిటల్ వీక్షణలను (Views) సాధించడం ఒక చారిత్రాత్మక మైలురాయి.
ఈ ప్రారంభ దశలో, 'స్థానికం' ఎడిటర్ మరియు రిపోర్టర్ శ్రీ కొండ మల్లేశం గౌడ్ అందించిన వార్తా కథనాలకు ఇంతటి భారీ స్పందన లభించడం స్థానిక మీడియాపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒక్క వ్యక్తి కృషికే ఇంతటి ప్రజాదరణ లభించగా, త్వరలో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి రిపోర్టర్లను రంగంలోకి దింపి, వార్తా విస్తృతిని మరింత పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము.
ఈ అపూర్వ విజయానికి కీలకమైన మా పాఠకులు, వీక్షకులు మరియు శ్రేయోభిలాషులందరికీ 'స్థానికం' డిజిటల్ మీడియా తరఫున, ముఖ్యంగా ఎడిటర్ శ్రీ కొండ మల్లేశం గౌడ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
మీ నమ్మకమే మా బలం. నిరంతరం ప్రజాహితం కోసం మా ప్రయాణం కొనసాగుతుంది.
ఇట్లు, యాజమాన్యం, స్థానికం డిజిటల్ మీడియా.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి