స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి
స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి
Editor Desk
రామన్నపేట: మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన హనుమాన్ యూత్ అసోసియేషన్ (Regd. No.160/2013) ఆధ్వర్యంలో గ్రామంలో నిర్మించిన సాంస్కృతిక వేదిక (స్టేజి)ను తొలగించవద్దని కోరుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీసులో సోమవారం వినతి పత్రం సమర్పించారు.
గ్రామంలోని పాత పాఠశాల ప్రాంగణంలో సంఘం స్వచ్ఛందంగా నిర్మించిన ఈ వేదిక గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తుల సమావేశాలు, జాతీయ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడుతోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామ యువత, పెద్దల సహకారంతో నిర్మించిన ఈ స్టేజి గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు.
విద్యా, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఈ వేదిక ఎంతో అవసరమని, దీనిని తొలగిస్తే గ్రామంలో జరిగే కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టేజిని యథాతథంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరారు.
గ్రామ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా అధికారులు సహకరించాలని సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి