PRINT TIME: May 27, 2026 03:43 AM
సర్పంచ్ సాయికుమార్ గౌడ్ను సన్మానించిన రజక సంఘం నాయకులు
సర్పంచ్ సాయికుమార్ గౌడ్ను సన్మానించిన రజక సంఘం నాయకులు
February 03, 2026 04:13 PM
158 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన రజక సంఘం నాయకులు గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా రజక వర్గానికి సంబంధించిన పలు సమస్యలపై సర్పంచ్తో చర్చించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో రజక సంఘానికి సంబంధించిన అంశాలపై సహకారం అందించాలని నాయకులు కోరారు. దీనికి సర్పంచ్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు బొడ్డుపల్లి శ్రీపతి, బొడ్డుపల్లి స్వామి, బొడ్డుపల్లి వెంకటేశం, బొడ్డుపల్లి ఊశయ్య, బొడ్డుపల్లి వినోద్ కుమార్, బొడ్డుపల్లి లక్ష్మణ్, బొడ్డుపల్లి మల్లేశం, ఆవనగంటి ధనుంజయ, బొడ్డుపల్లి ఆంజనేయులు, బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి