సర్పంచ్ సత్తయ్య యాదవ్కు ఘన సన్మానం
సర్పంచ్ సత్తయ్య యాదవ్కు ఘన సన్మానం
స్థానికం బృందం
రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్ను యువజన నాయకులు ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేస్తున్న సర్పంచ్ సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో టిఆర్ఎస్ రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధుల వల్లనే గ్రామాలు ముందుకు సాగుతాయని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజల సహకారం కూడా అవసరమని సూచించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో తిరుమలేష్, కృష్ణ, అచ్చాలు తదితరులు పాల్గొని సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి