Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 09:30 AM

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం
22-02-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్‌ను యువజన నాయకులు ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేస్తున్న సర్పంచ్ సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టిఆర్ఎస్ రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధుల వల్లనే గ్రామాలు ముందుకు సాగుతాయని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజల సహకారం కూడా అవసరమని సూచించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో తిరుమలేష్, కృష్ణ, అచ్చాలు తదితరులు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం

Article Image

రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్‌ను యువజన నాయకులు ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేస్తున్న సర్పంచ్ సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టిఆర్ఎస్ రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధుల వల్లనే గ్రామాలు ముందుకు సాగుతాయని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజల సహకారం కూడా అవసరమని సూచించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో తిరుమలేష్, కృష్ణ, అచ్చాలు తదితరులు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News