Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:32 AM

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం

సర్పంచ్ సత్తయ్య యాదవ్‌కు ఘన సన్మానం
February 22, 2026 08:09 PM 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామ సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్‌ను యువజన నాయకులు ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ శాలువా కప్పి, పూలమాలలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేస్తున్న సర్పంచ్ సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టిఆర్ఎస్ రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై పనిచేసే ప్రజాప్రతినిధుల వల్లనే గ్రామాలు ముందుకు సాగుతాయని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజల సహకారం కూడా అవసరమని సూచించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో తిరుమలేష్, కృష్ణ, అచ్చాలు తదితరులు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News