సర్పంచులు వార్డ్ మెంబర్లు 45 రోజుల్లో ఖర్చు నివేదికలు తప్పనిసరి లేదంటే ఎన్నికల బరిలో నిషేధం!
సర్పంచులు వార్డ్ మెంబర్లు 45 రోజుల్లో ఖర్చు నివేదికలు తప్పనిసరి లేదంటే ఎన్నికల బరిలో నిషేధం!
Editor Desk
ఎన్నికల్లో ఖర్చు లెక్కలపై SEC కఠిన హెచ్చరిక!
45 రోజుల్లోగా నివేదికలు ఇవ్వకుంటే అనర్హత తప్పదు
స్థానిక ప్రతినిధి
TG: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులందరూ తప్పనిసరిగా తమ ఎన్నికల ఖర్చు వివరాలను 45 రోజుల్లోగా సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆదేశించింది.
ఈ గడువు లోపు ఖర్చు నివేదికలు అందజేయని పక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని SEC స్పష్టం చేసింది. గెలుపొందిన అభ్యర్థులైతే నేరుగా అనర్హత వేటు పడుతుందని హెచ్చరించింది.
అలాగే, ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు సమర్పించని అభ్యర్థులకు మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హత ఉండదని కమిషన్ తేల్చిచెప్పింది.
పారదర్శకత, బాధ్యతాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SEC పేర్కొనగా, ఖర్చుల లెక్కల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అభ్యర్థులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి