సర్పంచ్ ఎన్నికలపై ఓటర్లను అప్రమత్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
సర్పంచ్ ఎన్నికలపై ఓటర్లను అప్రమత్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
స్థానికం బృందం
కాంగ్రెస్ పాలన రెండేళ్లలో రాష్ట్రం దారి తప్పింది. చిరుమర్తి లింగయ్య
నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
నార్కట్ పల్లి పట్టణంలోని తన నివాసంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ
రేపటి సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటరు బాధ్యతగా పోలింగ్ బూత్కి వెళ్లి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చినా… “రెండు ఏళ్లుగా పైసా పని చేయని ప్రభుత్వం ఇది” అని లింగయ్య విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఏమీ చేయకుండా ఎన్నికల సమయంలో మాత్రమే హామీల గాలం వేస్తున్నారని ఆరోపించారు.బీఆర్ఎస్ నాయకులపై వేధింపులు పెరిగాయి.నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నేతలు, స్థానిక పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా లింగయ్య ఆరోపించారు.నామినేషన్లు అడ్డుకోవడం, మద్దతుదారులను బెదిరించడం… పోలీసులను తెరగా పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి వివరాలు
తాము అధికారంలో ఉన్నప్పుడు నకిరేకల్లో వంద పడకల ఆసుపత్రి, అయిటిపాముల లిఫ్ట్, నార్కట్ పల్లి–రామన్నపేట–నకిరేకల్ సెంట్రల్ లైటింగ్, కుల సంఘ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ సబ్ సెంటర్లు, కాలేజీ భవనాలు వంటి అనేక కోట్ల రూపాయల పనులు చేపట్టామని లింగయ్య గుర్తుచేశారు.
ప్రజలు మోసపోయామని గ్రహించారు.
కాంగ్రెస్ పాలనలో బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, మార్పు పేరుతో మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారు అన్నారు.ప్రజల తరుపున మీ హక్కుల కోసం ప్రశ్నించే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు…

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి