Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:05 AM

సర్పంచ్ ఎన్నికలపై ఓటర్లను అప్రమత్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

సర్పంచ్ ఎన్నికలపై ఓటర్లను అప్రమత్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

సర్పంచ్ ఎన్నికలపై ఓటర్లను అప్రమత్తం చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
December 10, 2025 07:50 PM 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కాంగ్రెస్ పాలన రెండేళ్లలో రాష్ట్రం దారి తప్పింది. చిరుమర్తి లింగయ్య
నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నార్కట్ పల్లి పట్టణంలోని తన నివాసంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ

రేపటి సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటరు బాధ్యతగా పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చినా… “రెండు ఏళ్లుగా పైసా పని చేయని ప్రభుత్వం ఇది” అని లింగయ్య విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో ఏమీ చేయకుండా ఎన్నికల సమయంలో మాత్రమే హామీల గాలం వేస్తున్నారని ఆరోపించారు.బీఆర్‌ఎస్ నాయకులపై వేధింపులు పెరిగాయి.నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రెస్ నేతలు, స్థానిక పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా లింగయ్య ఆరోపించారు.నామినేషన్లు అడ్డుకోవడం, మద్దతుదారులను బెదిరించడం… పోలీసులను తెరగా పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి వివరాలు


తాము అధికారంలో ఉన్నప్పుడు నకిరేకల్‌లో వంద పడకల ఆసుపత్రి, అయిటిపాముల లిఫ్ట్, నార్కట్ పల్లి–రామన్నపేట–నకిరేకల్ సెంట్రల్ లైటింగ్, కుల సంఘ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ సబ్‌ సెంటర్లు, కాలేజీ భవనాలు వంటి అనేక కోట్ల రూపాయల పనులు చేపట్టామని లింగయ్య గుర్తుచేశారు.

ప్రజలు మోసపోయామని గ్రహించారు.

కాంగ్రెస్ పాలనలో బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, మార్పు పేరుతో మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారు అన్నారు.ప్రజల తరుపున మీ హక్కుల కోసం ప్రశ్నించే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు…



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News