Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:11 PM

సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు రూ.40 వేలు.. రూ.17 కోట్లు ఖర్చు.. వెండి, బంగారం కూడా..!

సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు రూ.40 వేలు.. రూ.17 కోట్లు ఖర్చు.. వెండి, బంగారం కూడా..!

సర్పంచ్ ఎన్నికల్లో ఓటుకు రూ.40 వేలు.. రూ.17 కోట్లు ఖర్చు.. వెండి, బంగారం కూడా..!
December 15, 2025 02:38 PM 214 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో డబ్బుల వర్షం కురుస్తోంది.

ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని సర్పంచ్ అభ్యర్థులు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. కొన్ని చోట్ల లక్షలు కుమ్మరిస్తుండగా.. మరికొన్ని చోట్ల ఏకంగా కోట్లు ఖర్చు పెడుతున్నారు. డబ్బు, మద్యంతో గ్రామాలు మొత్తం నిండిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సర్పంచ్.. ఓటుకు రూ.40 వేలు పంచినట్లు తెలుస్తోంది. వెండి, బంగారం కూడా ఓటర్లకు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.


తెలంగాణలో రెండో విడత పంచాయతీ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. ఇక చివరి విడత ఈనెల 17వ తేదీన జరగనుంది. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా మద్యం, డబ్బు సరఫరా జరుగుతోంది. ఎన్నికల అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను మాత్రం అడ్డుకోలేక పోతున్నారు. ఇంటింటికీ వెళ్లి డబ్బు, మద్యం సరఫరా చేస్తూ.. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు.. ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తున్నారు. ఇక పోలింగ్‌కు ముందు రోజు.. భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెండో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ సర్పంచ్ అభ్యర్థి.. ఏకంగా రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఓటుకు రూ.40 వేల చొప్పున పంచినట్లు తెలుస్తోంది.

సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పటాన్‌చెరు మండలానికి చెందిన ఓ గ్రామంలో.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన ఓ సర్పంచ్‌ అభ్యర్థి.. గెలిచేందుకు రూ.17 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు రావడం పెను సంచలనంగా మారింది. ఆ అభ్యర్థి.. గ్రామంలోని ఓటర్లందరికీ.. మూడు విడతల్లో డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా మూడు సార్లు కలిపి.. ఒక్కో ఓటరుకు రూ.40 వేల చొప్పున ఇచ్చినట్లు సమాచారం.

డబ్బు మాత్రమే కాకుండా వెండి, బంగారం, మద్యం కూడా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కొందరు మహిళ ఓటర్లకు వెండి గ్లాసులు, చిన్న చిన్న బంగారు నగలను కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. ఆ గ్రామంలో మొత్తం 780 ఇళ్లు ఉండగా.. అక్కడి ఓటర్లకు ఖరీదైన మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కేవలం మద్యం కోసమే రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 8 రోజుల ఎన్నికల ప్రచారంలో.. కేవలం భోజనాల ఖర్చే రూ. కోటి దాటినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలోనూ ధన ప్రవాహం జోరుగా సాగినట్లు తెలుస్తోంది. పలు మేజర్‌ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు సగటున రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. చేవెళ్ల డివిజన్‌లోని చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల్లో తక్కువలో తక్కువగా ఒక్కో ఓటుకు.. రూ.3 వేల నుంచి అత్యధికంగా.. రూ.15 వేల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News