స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
సామాజిక న్యాయం, ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన వీర యోధుడు వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వడ్డే ఓబన్న జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు.కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సాహితీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ కుల సంఘ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి