Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:44 AM

సలహాలతో కాదు… డిమాండ్‌తోనే ఆదోని జిల్లా సాధ్యం!

సలహాలతో కాదు… డిమాండ్‌తోనే ఆదోని జిల్లా సాధ్యం!

సలహాలతో కాదు… డిమాండ్‌తోనే ఆదోని జిల్లా సాధ్యం!
February 17, 2026 05:31 PM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అసెంబ్లీలో ఘాటు స్వరం లేకపోతే ఫలితం రాదు: జిల్లా సమితి హెచ్చరిక

ఆదోని: ఆదోని జిల్లా ఏర్పాటుపై అసెంబ్లీలో కేవలం సలహా మాదిరిగా ప్రస్తావించడం వల్ల ఫలితాలు రావని, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ స్పష్టమైన డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని ఆదోని జిల్లా సమితి అభిప్రాయపడింది. ఈ మేరకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలపై సమితి స్పందించింది.

ఆదోని జిల్లాకై ఐదు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం, గత 94 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, ప్రజా సంఘాల జేఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలను అసెంబ్లీలో సమగ్రంగా ప్రస్తావించి ఉంటే ప్రభుత్వం పై మరింత ఒత్తిడి ఏర్పడేదని సమితి పేర్కొంది.

“ఉద్యమాలకు స్పందించని ప్రభుత్వం ముందు ‘ఇస్తే బాగుంటుంది’ అన్న సలహా ఇవ్వడం అమాయకత్వమే” అని సమితి విమర్శించింది. అయితే “గుడ్డికంటే మెల్ల మేలు” అన్నట్లుగా ఆదోని జిల్లా అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం స్వాగతించదగ్గ విషయమేనని తెలిపింది.

రాబోయే రోజుల్లో ఆదోని ప్రాంత నాయకులు మరింత దూకుడుగా పోరాడాలని, లేకపోతే ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా సమితి హెచ్చరించింది.

— ఎ. నూర్ అహ్మద్

వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆదోని జిల్లా సమితి

సంప్రదింపు: 7396511404

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News