సలహాలతో కాదు… డిమాండ్తోనే ఆదోని జిల్లా సాధ్యం!
సలహాలతో కాదు… డిమాండ్తోనే ఆదోని జిల్లా సాధ్యం!
స్థానికం బృందం
అసెంబ్లీలో ఘాటు స్వరం లేకపోతే ఫలితం రాదు: జిల్లా సమితి హెచ్చరిక
ఆదోని: ఆదోని జిల్లా ఏర్పాటుపై అసెంబ్లీలో కేవలం సలహా మాదిరిగా ప్రస్తావించడం వల్ల ఫలితాలు రావని, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ స్పష్టమైన డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని ఆదోని జిల్లా సమితి అభిప్రాయపడింది. ఈ మేరకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలపై సమితి స్పందించింది.
ఆదోని జిల్లాకై ఐదు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం, గత 94 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, ప్రజా సంఘాల జేఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలను అసెంబ్లీలో సమగ్రంగా ప్రస్తావించి ఉంటే ప్రభుత్వం పై మరింత ఒత్తిడి ఏర్పడేదని సమితి పేర్కొంది.
“ఉద్యమాలకు స్పందించని ప్రభుత్వం ముందు ‘ఇస్తే బాగుంటుంది’ అన్న సలహా ఇవ్వడం అమాయకత్వమే” అని సమితి విమర్శించింది. అయితే “గుడ్డికంటే మెల్ల మేలు” అన్నట్లుగా ఆదోని జిల్లా అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం స్వాగతించదగ్గ విషయమేనని తెలిపింది.
రాబోయే రోజుల్లో ఆదోని ప్రాంత నాయకులు మరింత దూకుడుగా పోరాడాలని, లేకపోతే ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా సమితి హెచ్చరించింది.
— ఎ. నూర్ అహ్మద్
వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆదోని జిల్లా సమితి
సంప్రదింపు: 7396511404

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి