సారా కేసులో పాత నేరస్తులు బైండవర్
సారా కేసులో పాత నేరస్తులు బైండవర్
స్థానికం బృందం
ఏలూరు స్థానికం రిపోర్టర్ గడ్డం జగన్మోహన్ రెడ్డి
చాట్రాయి, ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ వరిధిలో సంక్రాంతి సందర్భంగా అక్రమ నాటు సారా నియంత్రణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐదుగురుని చాట్రాయి తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య చెప్పారు. నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులను బైండోవర్ చేశామన్నారు. వీరిలో ఒకరు బెల్లం వ్యాపారి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఈ బైండ్ ఓవర్ కు ఒక సంవత్సరం కాల పరిమితి ఉంటుందని, ఈ కాల పరిమితిలో మరలా ఎక్సైజ్ నేరాలకు పాల్పడినచో, సంబంధిత వ్యక్తులపై లక్ష రూపాయలు జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని పాత నేరస్తులను అయన కఠినంగా హెచ్చరించారు. బైండోవర్ చేయబడిన పాత నేరస్తులు పోతనవల్లి గ్రామానికి చెందిన ధారావతు నాగరాజు, హస్సావతు విజయ, ధారావతు కుమార్, పోలవరం గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి సగ్గుల రవికుమార్, జనార్ధనవరం గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాసరావులు ఉన్నట్లు ఆయన తెలిపారు. సారా వ్యాపారం చేసిన సారా కాచిన సమాచారం తెలియజేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య చెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి