Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:20 AM

సారా కేసులో పాత నేరస్తులు బైండవర్

సారా కేసులో పాత నేరస్తులు బైండవర్

సారా కేసులో పాత నేరస్తులు బైండవర్
December 31, 2025 11:34 AM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఏలూరు స్థానికం రిపోర్టర్ గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి, ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ వరిధిలో సంక్రాంతి సందర్భంగా అక్రమ నాటు సారా నియంత్రణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐదుగురుని చాట్రాయి తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య చెప్పారు. నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులను బైండోవర్ చేశామన్నారు. వీరిలో ఒకరు బెల్లం వ్యాపారి కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఈ బైండ్ ఓవర్ కు ఒక సంవత్సరం కాల పరిమితి ఉంటుందని, ఈ కాల పరిమితిలో మరలా ఎక్సైజ్ నేరాలకు పాల్పడినచో, సంబంధిత వ్యక్తులపై లక్ష రూపాయలు జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని పాత నేరస్తులను అయన కఠినంగా హెచ్చరించారు. బైండోవర్ చేయబడిన పాత నేరస్తులు పోతనవల్లి గ్రామానికి చెందిన ధారావతు నాగరాజు, హస్సావతు విజయ, ధారావతు కుమార్, పోలవరం గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి సగ్గుల రవికుమార్, జనార్ధనవరం గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాసరావులు ఉన్నట్లు ఆయన తెలిపారు. సారా వ్యాపారం చేసిన సారా కాచిన సమాచారం తెలియజేయాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News