Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:21 AM

సాగు చేసే రైతులకే రైతు భరోసా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సాగు చేసే రైతులకే రైతు భరోసా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సాగు చేసే రైతులకే రైతు భరోసా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
December 29, 2025 05:51 AM 29,173 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనర్హ భూములకు పెట్టుబడి సాయం నిలిపివేత

రైతు భరోసా మార్గదర్శకాలపై కీలక మార్పులు

హైదరాబాద్‌ స్థానికం ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై నిజంగా సాగు చేసే రైతులకే రైతు భరోసా నిధులు అందించాలని నిర్ణయించింది. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో మాదిరిగా పెట్టుబడి సాయం ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పథకం అమలు, మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు, సాగుకు అనర్హమైన భూములకు కూడా గతంలో నిధులు వెళ్లినట్లు గుర్తించడంతో ఈ మార్పులు చేపట్టినట్లు సమాచారం.

గతంలో అమలులో ఉన్న పెట్టుబడి సాయం పథకంలో అనర్హులు లబ్ధి పొందినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకు మాత్రమే న్యాయం జరిగేలా రైతు భరోసా పథకాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇకపై క్షేత్రస్థాయిలో పంట సాగు జరుగుతున్న భూములను మాత్రమే గుర్తించి పెట్టుబడి సాయం అందించనున్నారు. సాగు లేని భూములకు నిధులు నిలిపివేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడమే కాకుండా, నిజమైన రైతుకు మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ నిర్ణయంతో రైతు భరోసా పథకం లక్ష్యభ్రంశం కాకుండా, ఉద్దేశ్యపూర్వకంగా అమలు కానుంది అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మీ స్పందన? 46 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News