శ్రీ సత్యసాయి జిల్లాలోని రొద్దం హెడ్క్వార్టర్లో బి.ఆర్ అంబేద్కర్
136వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న బి.కే. పార్థసారథి అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషిని కొనియాడారు. సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపనకు ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, మాజీ జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, చిన్నప్పయ్య , ఎంఆర్పీఎస్ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ ఆదర్శాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి