Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందాలి – కలెక్టర్ బి. చంద్రశేఖర్ బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 09:58 PM

రిటైర్మెంట్‌కు అడుగు దూరంలో ఏసీబీకి చిక్కిన ఆర్డీవో: రూ. 25 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా...

రిటైర్మెంట్‌కు అడుగు దూరంలో ఏసీబీకి చిక్కిన ఆర్డీవో: రూ. 25 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా...

రిటైర్మెంట్‌కు అడుగు దూరంలో ఏసీబీకి చిక్కిన ఆర్డీవో: రూ. 25 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా...
April 21, 2026 08:17 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

అవినీతి రహిత పాలన అందించాలని ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా, కొందరు అధికారులు మాత్రం తమ పద్ధతి మార్చుకోవడం లేదు. తాజాగా నారాయణపేట జిల్లా రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (RDO Office) లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నారాయణపేట ఆర్డీవో రాంచందర్ నాయక్ రూ. 25,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

అసలేం జరిగిందంటే?

బాధితుల కథనం ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు సంబంధించి జనన ధృవీకరణ పత్రాలు (Birth Certificates) జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆర్డీవో రాంచందర్ నాయక్ లంచం డిమాండ్ చేశారు. ఐదు సర్టిఫికెట్ల కోసం మొత్తం రూ. 25,000 ఇస్తేనే సంతకం పెడతానని భీష్మించుక కూర్చున్నారు. పని జరగక ఇబ్బంది పడుతున్న బాధితులు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఏసీబీ పక్కా స్కెచ్

బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణయ్య నేతృత్వంలో అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం బాధితుల నుండి ఆర్డీవో రాంచందర్ నాయక్ తన కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా, ఏసీబీ బృందం మెరుపు దాడి చేసింది. లంచం తీసుకున్న డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయన చేతులకు కెమికల్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

రిటైర్మెంట్ వేళ తీరని కళంకం:

ఈ కేసులో అత్యంత విషాదకరమైన మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆర్డీవో రాంచందర్ నాయక్ సర్వీసు ముగింపు దశలో ఉన్నారు. ఆయన ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో పదవీ విరమణ (Retirement) పొందాల్సి ఉంది. గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ చేయాల్సిన సమయంలో, కేవలం కొన్ని వేల రూపాయల ఆశతో ఏసీబీకి చిక్కడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇన్ని ఏళ్ల సర్వీసును, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తాన్ని ఈ ఒక్క ఘటనతో రిస్క్ లో పడేసుకున్నారని తోటి ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.

ఏసీబీ డీఎస్పీ ప్రకటన:

దాడుల అనంతరం ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వ పనుల కోసం అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలి. రాంచందర్ నాయక్‌ను అరెస్ట్ చేశాం. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నాం. ఆయనను రిమాండ్ నిమిత్తం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలిస్తాం" అని వెల్లడించారు.

ఈ దాడితో నారాయణపేట జిల్లా కలెక్టరేట్ మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంగళవారం జరిగిన ఈ పరిణామం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News