రిటైర్డ్ ఉపాధ్యాయుడు రేకల ఆనందం ఆత్మహత్య
రిటైర్డ్ ఉపాధ్యాయుడు రేకల ఆనందం ఆత్మహత్య
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 03:
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని మీనా నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ నివాసముంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు రేకల ఆనందం (70) మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.స్థానికుల సమాచారం ప్రకారం, రేకల ఆనందం వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందినవాడు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్మెంట్ అనంతరం భువనగిరిలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు భువనగిరిలో వ్యాపారం చేస్తుండగా, చిన్న కుమారుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు.గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఆనందం మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. భార్య హైదరాబాద్లో ఉన్న సమయంలో ఇంట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పదిమందికి ధైర్యం చెప్పే స్వభావం కలిగిన ఆనందం ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని మిత్రులు, బంధువులుజీర్ణించుకోలేకపోతున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్న కుమారుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అనంతరం బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి