రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు
రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు
GADDAM JAGANMOHAN REDDY
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ సభ్యులు సమూహంగా లొంగిపోవడం విశేషంగా నిలిచింది. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న మొత్తం 124 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో దేవ్జీ, బడే చొక్కారావు గన్మెన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని తెలిపారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.
మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు, పోలీసులు తీవ్రంగా కృషి చేశారని సీఎం పేర్కొన్నారు. మావోయిస్టుల్లో నమ్మకం కల్పించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని అన్నారు. దేవ్జీ మరియు ఆయన మిత్రబృందం కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. వారి సమస్యలను పరిష్కరిస్తే లొంగిపోతామని వారు పేర్కొన్నారని చెప్పారు.
రాష్ట్ర స్థాయిలో చేయగలిగిన చర్యలన్నీ తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి సహా తెలంగాణకు చెందిన మరో ఏడుగురు త్వరగా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసంతో పాటు రివార్డు కూడా అందజేస్తామని తెలిపారు. వారికి ప్రత్యేక ఆరోగ్య భద్రత కార్డులు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి