Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:37 AM

రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు
March 07, 2026 11:35 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ సభ్యులు సమూహంగా లొంగిపోవడం విశేషంగా నిలిచింది. లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న మొత్తం 124 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని తెలిపారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టుల లొంగుబాటుకు అధికారులు, పోలీసులు తీవ్రంగా కృషి చేశారని సీఎం పేర్కొన్నారు. మావోయిస్టుల్లో నమ్మకం కల్పించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని అన్నారు. దేవ్‌జీ మరియు ఆయన మిత్రబృందం కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. వారి సమస్యలను పరిష్కరిస్తే లొంగిపోతామని వారు పేర్కొన్నారని చెప్పారు.

రాష్ట్ర స్థాయిలో చేయగలిగిన చర్యలన్నీ తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి సహా తెలంగాణకు చెందిన మరో ఏడుగురు త్వరగా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసంతో పాటు రివార్డు కూడా అందజేస్తామని తెలిపారు. వారికి ప్రత్యేక ఆరోగ్య భద్రత కార్డులు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News