Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:33 PM

రేపటి నుంచి యూరియా బుకింగ్ మొబైల్ విధానం'

రేపటి నుంచి యూరియా బుకింగ్ మొబైల్ విధానం'

రేపటి నుంచి యూరియా బుకింగ్ మొబైల్ విధానం'
February 07, 2026 05:54 PM 768 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రేపటి నుంచి యాప్ ద్వారానే కొనుగోలు.రమణా రెడ్డి

యాదాద్రి భువనగిరి:

జిల్లాలో యూరియా పంపిణీ విధానంలో కీలక మార్పు చేపట్టారు. రైతులకు మరింత పారదర్శకంగా, సక్రమంగా యూరియా అందించేందుకు కొత్త మొబైల్ బుకింగ్ విధానాన్ని రేపటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇకపై యూరియా కొనుగోలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారానే జరగనుంది. ప్రత్యక్షంగా యూరియా పంపిణీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

రైతులు తమ మొబైల్ నంబర్ ద్వారా యాప్‌లో నమోదు చేసుకుని సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు. జిల్లాలోని ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఎవరైనా పరిశీలించే అవకాశం ఉంటుంది. పట్టా భూ యజమానులు, అటవీ హక్కుల పట్టాదారులు, నాన్ పట్టా రైతులు, కౌలుదారులు మాత్రమే యూరియా బుకింగ్‌కు అర్హులు.బుకింగ్ సమయంలో రైతుల గుర్తింపును నిర్ధారించేందుకు పట్టా పాస్ పుస్తకంతో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఒకసారి మాత్రమే ఉపయోగించే సంకేత సంఖ్య పంపిస్తారు. విక్రయ కేంద్రాలు నమోదు చేసే తాజా నిల్వల ఆధారంగా రైతులు అవసరమైన యూరియా సంచులను బుక్ చేసుకోవచ్చు.బుకింగ్ విజయవంతమైన వెంటనే ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేస్తారు. రైతు భూమిలో నమోదు చేసిన సాగు విస్తీర్ణంఆధారంగా యూరియా సంచుల సంఖ్య స్వయంచాలకంగా నిర్ణయించబడుతుంది. పంపిణీ సక్రమంగా జరిగేందుకు బుకింగ్లను విడతల వారీగా అమలు చేస్తారు.రైతులు జిల్లాలోని ఏదైనా ఎరువుల విక్రయ కేంద్రం లేదా సహకార సంఘం ద్వారా బుక్ చేసుకున్న యూరియాను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమైతే మొత్తం బుకింగ్ పరిమాణాన్ని వేర్వేరు విక్రయ కేంద్రాల నుంచి పొందవచ్చు.సాగు వివరాల ట్యాబ్‌లో ఒకసారి భూమి విస్తీర్ణం నమోదు చేసిన తర్వాత మార్పు చేసే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. యూరియా బుకింగ్ ఇరవై నాలుగు గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ సమయంలో యూరియాను కొనుగోలు చేయకపోతే బుకింగ్ స్వయంచాలకంగా రద్దై నిల్వ తిరిగి వ్యవస్థలోకి వెళ్లిపోతుంది.

రేపటి నుంచి యూరియా కొనుగోలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారానే జరగనుందని, రైతులంతా ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News