Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:02 PM

రేపటి నుంచి యూరియా బుకింగ్ మొబైల్ విధానం'

రేపటి నుంచి యూరియా బుకింగ్ మొబైల్ విధానం'

రేపటి నుంచి యూరియా బుకింగ్ మొబైల్ విధానం'
February 07, 2026 05:54 PM 755 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రేపటి నుంచి యాప్ ద్వారానే కొనుగోలు.రమణా రెడ్డి

యాదాద్రి భువనగిరి:

జిల్లాలో యూరియా పంపిణీ విధానంలో కీలక మార్పు చేపట్టారు. రైతులకు మరింత పారదర్శకంగా, సక్రమంగా యూరియా అందించేందుకు కొత్త మొబైల్ బుకింగ్ విధానాన్ని రేపటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇకపై యూరియా కొనుగోలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారానే జరగనుంది. ప్రత్యక్షంగా యూరియా పంపిణీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

రైతులు తమ మొబైల్ నంబర్ ద్వారా యాప్‌లో నమోదు చేసుకుని సులభంగా బుకింగ్ చేసుకోవచ్చు. జిల్లాలోని ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఎవరైనా పరిశీలించే అవకాశం ఉంటుంది. పట్టా భూ యజమానులు, అటవీ హక్కుల పట్టాదారులు, నాన్ పట్టా రైతులు, కౌలుదారులు మాత్రమే యూరియా బుకింగ్‌కు అర్హులు.బుకింగ్ సమయంలో రైతుల గుర్తింపును నిర్ధారించేందుకు పట్టా పాస్ పుస్తకంతో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఒకసారి మాత్రమే ఉపయోగించే సంకేత సంఖ్య పంపిస్తారు. విక్రయ కేంద్రాలు నమోదు చేసే తాజా నిల్వల ఆధారంగా రైతులు అవసరమైన యూరియా సంచులను బుక్ చేసుకోవచ్చు.బుకింగ్ విజయవంతమైన వెంటనే ప్రత్యేక గుర్తింపు సంఖ్య జారీ చేస్తారు. రైతు భూమిలో నమోదు చేసిన సాగు విస్తీర్ణంఆధారంగా యూరియా సంచుల సంఖ్య స్వయంచాలకంగా నిర్ణయించబడుతుంది. పంపిణీ సక్రమంగా జరిగేందుకు బుకింగ్లను విడతల వారీగా అమలు చేస్తారు.రైతులు జిల్లాలోని ఏదైనా ఎరువుల విక్రయ కేంద్రం లేదా సహకార సంఘం ద్వారా బుక్ చేసుకున్న యూరియాను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమైతే మొత్తం బుకింగ్ పరిమాణాన్ని వేర్వేరు విక్రయ కేంద్రాల నుంచి పొందవచ్చు.సాగు వివరాల ట్యాబ్‌లో ఒకసారి భూమి విస్తీర్ణం నమోదు చేసిన తర్వాత మార్పు చేసే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. యూరియా బుకింగ్ ఇరవై నాలుగు గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ సమయంలో యూరియాను కొనుగోలు చేయకపోతే బుకింగ్ స్వయంచాలకంగా రద్దై నిల్వ తిరిగి వ్యవస్థలోకి వెళ్లిపోతుంది.

రేపటి నుంచి యూరియా కొనుగోలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారానే జరగనుందని, రైతులంతా ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News