రెండో వార్డులో షేక్ షబానా అజీమ్ గెలుపు ఖాయం : కంభంపాటి శ్రీనివాసులు గౌడ్
రెండో వార్డులో షేక్ షబానా అజీమ్ గెలుపు ఖాయం : కంభంపాటి శ్రీనివాసులు గౌడ్
స్థానికం బృందం
ప్రచారంలో నిమగ్నమైన టీఆర్ఎస్ అభ్యర్థులు
చిట్యాల :
చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు గుర్తు చేస్తూ, స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం వాస్తవమని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రెండో వార్డ్ ఇంచార్జ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని, రెండో వార్డులో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రెండో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లివాడ, ఎండి గౌస్, కోనూరు శివకుమార్, రావుల వెంకన్న, కర్రె శ్రీనివాస్, పావిరాల నరసింహ, మాదాసు పరమేష్, జటాంగి వెంకన్న, పావిరాల లివేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి