PRINT TIME: February 23, 2026 02:57 PM
రెడ్యాల చేరిన సీఎం – రాఘవేందర్ రెడ్డికి ఘన నివాళి, కుటుంబానికి భరోసా
రెడ్యాల చేరిన సీఎం – రాఘవేందర్ రెడ్డికి ఘన నివాళి, కుటుంబానికి భరోసా
February 22, 2026 07:10 PM
18 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
రేవంత్ రెడ్డి ఆదివారం రెడ్యాల గ్రామంను సందర్శించి వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతిపై సంతాపం తెలిపారు. ఈ నెల 11న ఆయన మరణించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
గ్రామానికి చేరుకున్న సీఎం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి సోదరులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్లను కలిసి ఓదార్చారు. సీఎం పర్యటనతో గ్రామానికి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తరలివచ్చారు.
రాఘవేందర్ రెడ్డి మరణం ప్రాంతానికి తీరని లోటని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి