Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:52 PM

రెడ్యాల చేరిన సీఎం – రాఘవేందర్ రెడ్డికి ఘన నివాళి, కుటుంబానికి భరోసా

రెడ్యాల చేరిన సీఎం – రాఘవేందర్ రెడ్డికి ఘన నివాళి, కుటుంబానికి భరోసా

రెడ్యాల చేరిన సీఎం – రాఘవేందర్ రెడ్డికి ఘన నివాళి, కుటుంబానికి భరోసా
February 22, 2026 07:10 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రేవంత్ రెడ్డి ఆదివారం రెడ్యాల గ్రామంను సందర్శించి వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతిపై సంతాపం తెలిపారు. ఈ నెల 11న ఆయన మరణించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

గ్రామానికి చేరుకున్న సీఎం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి సోదరులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్‌లను కలిసి ఓదార్చారు. సీఎం పర్యటనతో గ్రామానికి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తరలివచ్చారు.

రాఘవేందర్ రెడ్డి మరణం ప్రాంతానికి తీరని లోటని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News