రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం
రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి, కొత్తచెరువు మండలం అయినా. మైలేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఆదివారం అక్షయ తృతీయ సందర్బంగా రెడ్స్ డైరెక్ట్ భానుజ గారి ఆదేశాల మేరకు ఆంజనేయస్వామి
దేవాలయం లో బాల్య వివాహాలపై అవగాహన కలిగించడం జరిగింది. 18సం" లోపల ఉన్న బాలికలకు, 21సం" లోపల ఉన్న బాలురులకు బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. గ్రామంలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 నెంబర్ కు గాని, సంబంధిత అధికారులకు గాని తెలియజేయాలని,బాల, బాలికలు బడిలోనే ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది. మా గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా మారుస్తామని పూజారుల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోఆర్డినేటర్ గంగరాజు, సి ఎస్ డబ్ల్యూ అంజలి, కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ అంజలి, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి