Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:50 AM

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు
11-02-2026 182 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ కమిటీలో గొరిగె సోములు

భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు)కి తెలంగాణ ప్రతినిధిగా ఎంపిక

రావన్నపేట, భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు అనుబంధం) జాతీయ కమిటీ సభ్యుడిగా రావన్నపేట పట్టణానికి చెందిన గొరిగె సోములు ఎన్నికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం సికర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన అఖిల భారత మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోములను జాతీయ కమిటీలోకి ఎన్నుకున్నారు.ప్రస్తుతం సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శిగా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సోములు జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నారు.ఈ సందర్భంగా సోములు మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులను ఏకం చేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని తెలిపారు. జాతీయ కమిటీలో బాధ్యతలు అప్పగించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జాతీయ కమిటీలోకి ఎన్నికైన సోములను సీఐటీయు మండల నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, నకిరేకంటి రాము, వంగాల మారయ్య, అప్పం సురేందర్, పల్లె సత్యం తదితరులు అభినందించారు.

Sthanikam

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

Article Image

జాతీయ కమిటీలో గొరిగె సోములు

భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు)కి తెలంగాణ ప్రతినిధిగా ఎంపిక

రావన్నపేట, భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు అనుబంధం) జాతీయ కమిటీ సభ్యుడిగా రావన్నపేట పట్టణానికి చెందిన గొరిగె సోములు ఎన్నికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం సికర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన అఖిల భారత మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోములను జాతీయ కమిటీలోకి ఎన్నుకున్నారు.ప్రస్తుతం సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శిగా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సోములు జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నారు.ఈ సందర్భంగా సోములు మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులను ఏకం చేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని తెలిపారు. జాతీయ కమిటీలో బాధ్యతలు అప్పగించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జాతీయ కమిటీలోకి ఎన్నికైన సోములను సీఐటీయు మండల నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, నకిరేకంటి రాము, వంగాల మారయ్య, అప్పం సురేందర్, పల్లె సత్యం తదితరులు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News