Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:31 AM

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు
February 11, 2026 04:07 PM 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ కమిటీలో గొరిగె సోములు

భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు)కి తెలంగాణ ప్రతినిధిగా ఎంపిక

రావన్నపేట, భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు అనుబంధం) జాతీయ కమిటీ సభ్యుడిగా రావన్నపేట పట్టణానికి చెందిన గొరిగె సోములు ఎన్నికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం సికర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన అఖిల భారత మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోములను జాతీయ కమిటీలోకి ఎన్నుకున్నారు.ప్రస్తుతం సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శిగా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సోములు జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నారు.ఈ సందర్భంగా సోములు మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులను ఏకం చేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని తెలిపారు. జాతీయ కమిటీలో బాధ్యతలు అప్పగించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జాతీయ కమిటీలోకి ఎన్నికైన సోములను సీఐటీయు మండల నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, నకిరేకంటి రాము, వంగాల మారయ్య, అప్పం సురేందర్, పల్లె సత్యం తదితరులు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News