Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:42 PM

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు
February 11, 2026 04:07 PM 178 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ కమిటీలో గొరిగె సోములు

భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు)కి తెలంగాణ ప్రతినిధిగా ఎంపిక

రావన్నపేట, భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు అనుబంధం) జాతీయ కమిటీ సభ్యుడిగా రావన్నపేట పట్టణానికి చెందిన గొరిగె సోములు ఎన్నికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం సికర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన అఖిల భారత మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోములను జాతీయ కమిటీలోకి ఎన్నుకున్నారు.ప్రస్తుతం సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శిగా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సోములు జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నారు.ఈ సందర్భంగా సోములు మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులను ఏకం చేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని తెలిపారు. జాతీయ కమిటీలో బాధ్యతలు అప్పగించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జాతీయ కమిటీలోకి ఎన్నికైన సోములను సీఐటీయు మండల నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, నకిరేకంటి రాము, వంగాల మారయ్య, అప్పం సురేందర్, పల్లె సత్యం తదితరులు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News