Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:06 PM

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు

రావన్నపేటకు గర్వకారణం… జాతీయ స్థాయికి ఎదిగిన గొరిగె సోములు
February 11, 2026 04:07 PM 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ కమిటీలో గొరిగె సోములు

భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు)కి తెలంగాణ ప్రతినిధిగా ఎంపిక

రావన్నపేట, భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు అనుబంధం) జాతీయ కమిటీ సభ్యుడిగా రావన్నపేట పట్టణానికి చెందిన గొరిగె సోములు ఎన్నికయ్యారు. రాజస్థాన్ రాష్ట్రం సికర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన అఖిల భారత మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోములను జాతీయ కమిటీలోకి ఎన్నుకున్నారు.ప్రస్తుతం సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శిగా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సోములు జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు సాగిస్తున్నారు.ఈ సందర్భంగా సోములు మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులను ఏకం చేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని తెలిపారు. జాతీయ కమిటీలో బాధ్యతలు అప్పగించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జాతీయ కమిటీలోకి ఎన్నికైన సోములను సీఐటీయు మండల నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, నకిరేకంటి రాము, వంగాల మారయ్య, అప్పం సురేందర్, పల్లె సత్యం తదితరులు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News