నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో తహసీల్దార్గా పనిచేస్తున్న జయవర్ధన్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశారు. మండల కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని తీవ్రంగా వేధిస్తూ, లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ వేధింపులను భరించలేక బాధితురాలు రెవెన్యూ డివిజనల్ అధికారికి (ఆర్డీఓ) ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై ఆర్డీఓ అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా, తహసీల్దార్ జయవర్ధన్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమని తేలింది.
విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించగా, ఆ నివేదిక ఆధారంగా తహసీల్దార్ జయవర్ధన్ను వెంటనే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్యాలయాల్లో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి