Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!
February 18, 2026 08:49 AM 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పంటల నమోదు సర్వేకు 10,909 మంది నియామకం – ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు

హైదరాబాద్:

రాష్ట్రంలో పంటల నమోదు సర్వే నిర్వహణ కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున మొత్తం 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. యాసంగి సీజన్‌లో పంటల వివరాలను సేకరించి ఫొటోలు తీసి నమోదు చేయడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి, గ్రామ భూములపై అవగాహన కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన వాలంటీర్లకు తీసిన ప్రతి ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు అందుతుంది. 45 రోజుల యాసంగి సీజన్‌లో గరిష్టంగా 2000 ఫొటోలు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో సంబంధిత మండల వ్యవసాయ అధికారుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పంటల సర్వే ప్రక్రియను వేగవంతం చేయడం, రైతుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News