Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!
February 18, 2026 08:49 AM 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పంటల నమోదు సర్వేకు 10,909 మంది నియామకం – ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు

హైదరాబాద్:

రాష్ట్రంలో పంటల నమోదు సర్వే నిర్వహణ కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున మొత్తం 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. యాసంగి సీజన్‌లో పంటల వివరాలను సేకరించి ఫొటోలు తీసి నమోదు చేయడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి, గ్రామ భూములపై అవగాహన కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన వాలంటీర్లకు తీసిన ప్రతి ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు అందుతుంది. 45 రోజుల యాసంగి సీజన్‌లో గరిష్టంగా 2000 ఫొటోలు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో సంబంధిత మండల వ్యవసాయ అధికారుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పంటల సర్వే ప్రక్రియను వేగవంతం చేయడం, రైతుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News