రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!
రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!
Biksham
పంటల నమోదు సర్వేకు 10,909 మంది నియామకం – ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు
హైదరాబాద్:
రాష్ట్రంలో పంటల నమోదు సర్వే నిర్వహణ కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున మొత్తం 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. యాసంగి సీజన్లో పంటల వివరాలను సేకరించి ఫొటోలు తీసి నమోదు చేయడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి, గ్రామ భూములపై అవగాహన కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన వాలంటీర్లకు తీసిన ప్రతి ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు అందుతుంది. 45 రోజుల యాసంగి సీజన్లో గరిష్టంగా 2000 ఫొటోలు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో సంబంధిత మండల వ్యవసాయ అధికారుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పంటల సర్వే ప్రక్రియను వేగవంతం చేయడం, రైతుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి