Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:29 PM

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!
18-02-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పంటల నమోదు సర్వేకు 10,909 మంది నియామకం – ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు

హైదరాబాద్:

రాష్ట్రంలో పంటల నమోదు సర్వే నిర్వహణ కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున మొత్తం 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. యాసంగి సీజన్‌లో పంటల వివరాలను సేకరించి ఫొటోలు తీసి నమోదు చేయడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి, గ్రామ భూములపై అవగాహన కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన వాలంటీర్లకు తీసిన ప్రతి ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు అందుతుంది. 45 రోజుల యాసంగి సీజన్‌లో గరిష్టంగా 2000 ఫొటోలు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో సంబంధిత మండల వ్యవసాయ అధికారుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పంటల సర్వే ప్రక్రియను వేగవంతం చేయడం, రైతుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.

Sthanikam

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం..!

Article Image

పంటల నమోదు సర్వేకు 10,909 మంది నియామకం – ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు

హైదరాబాద్:

రాష్ట్రంలో పంటల నమోదు సర్వే నిర్వహణ కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున మొత్తం 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. యాసంగి సీజన్‌లో పంటల వివరాలను సేకరించి ఫొటోలు తీసి నమోదు చేయడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి, గ్రామ భూములపై అవగాహన కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన వాలంటీర్లకు తీసిన ప్రతి ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లింపు అందుతుంది. 45 రోజుల యాసంగి సీజన్‌లో గరిష్టంగా 2000 ఫొటోలు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో సంబంధిత మండల వ్యవసాయ అధికారుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పంటల సర్వే ప్రక్రియను వేగవంతం చేయడం, రైతుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News