Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 14, 2026 10:58 AM

రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు

రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు

రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కోసం రూ.1.50 కోట్లు మంజూరు
March 11, 2026 07:13 AM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల నిర్వహణకు మొత్తం రూ.1.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం రూ.1.50 కోట్లలో రూ.1 కోటి ప్రభుత్వ నిధులు కాగా, మిగిలిన రూ.50 లక్షలు ఏపీ స్టేట్ హజ్ కమిటీ నిధుల నుంచి సమీకరించారు.

రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందును మార్చి 13, 2026న విజయవాడలోని లబ్బీపేటలో ఉన్న ‘ఏ కన్వెన్షన్’లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇందుకు రూ.75 లక్షలను కేటాయించారు.

మిగిలిన రూ.75 లక్షలను రాష్ట్రంలోని 26 జిల్లాలకు పంపిణీ చేసి జిల్లా స్థాయిలో ఇఫ్తార్ విందులు నిర్వహించనున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News