రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం
రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం
స్థానికం బృందం
టైక్వాండోలో ఎన్జీ కళాశాల విద్యార్థి ప్రతిభ
గచ్చిబౌలి, గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన స్టేట్ సి.ఎం. కప్ టైక్వాండో ఛాంపియన్షిప్లో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థి యన్. మనోజ్ యాదవ్ బంగారు పతకం సాధించాడు. అండర్-17 విభాగంలో 78 కేజీల కేటగిరీలో పోటీపడి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల మధ్య జరిగిన కఠిన పోటీలో మనోజ్ యాదవ్ చాకచక్యంగా ఆడి విజేతగా నిలిచాడు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో అతని ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థి సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
ఫిజికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస రెడ్డి, నర్సింగ్ కోటయ్య, డాక్టర్ వెంకటేష్, మన్నెం వెంకటయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థిని అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి