Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:26 AM

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం
23-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టైక్వాండోలో ఎన్జీ కళాశాల విద్యార్థి ప్రతిభ

గచ్చిబౌలి, గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన స్టేట్ సి.ఎం. కప్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థి యన్‌. మనోజ్ యాదవ్ బంగారు పతకం సాధించాడు. అండర్-17 విభాగంలో 78 కేజీల కేటగిరీలో పోటీపడి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల మధ్య జరిగిన కఠిన పోటీలో మనోజ్ యాదవ్ చాకచక్యంగా ఆడి విజేతగా నిలిచాడు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో అతని ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థి సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

ఫిజికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస రెడ్డి, నర్సింగ్ కోటయ్య, డాక్టర్ వెంకటేష్, మన్నెం వెంకటయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థిని అభినందించారు.

Sthanikam

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం

Article Image

టైక్వాండోలో ఎన్జీ కళాశాల విద్యార్థి ప్రతిభ

గచ్చిబౌలి, గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన స్టేట్ సి.ఎం. కప్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థి యన్‌. మనోజ్ యాదవ్ బంగారు పతకం సాధించాడు. అండర్-17 విభాగంలో 78 కేజీల కేటగిరీలో పోటీపడి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల మధ్య జరిగిన కఠిన పోటీలో మనోజ్ యాదవ్ చాకచక్యంగా ఆడి విజేతగా నిలిచాడు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో అతని ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థి సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

ఫిజికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస రెడ్డి, నర్సింగ్ కోటయ్య, డాక్టర్ వెంకటేష్, మన్నెం వెంకటయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థిని అభినందించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News