Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:30 AM

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం కైవసం
February 23, 2026 03:08 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టైక్వాండోలో ఎన్జీ కళాశాల విద్యార్థి ప్రతిభ

గచ్చిబౌలి, గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన స్టేట్ సి.ఎం. కప్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థి యన్‌. మనోజ్ యాదవ్ బంగారు పతకం సాధించాడు. అండర్-17 విభాగంలో 78 కేజీల కేటగిరీలో పోటీపడి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల మధ్య జరిగిన కఠిన పోటీలో మనోజ్ యాదవ్ చాకచక్యంగా ఆడి విజేతగా నిలిచాడు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో అతని ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థి సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

ఫిజికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస రెడ్డి, నర్సింగ్ కోటయ్య, డాక్టర్ వెంకటేష్, మన్నెం వెంకటయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థిని అభినందించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News