Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 04:36 AM

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం
20-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి

రామన్నపేట మండలంలో యూరియా సరఫరాలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని బండ మధుకర్ రెడ్డి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అందాల్సిన యూరియా మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆయన విమర్శించారు.

ఎరువుల దుకాణాల యజమానులు కుమ్మక్కై రైతుల పాస్‌బుక్కులు ముందుగానే సేకరించి ఓటీపీ నమోదు చేసి యూరియాను బుక్‌ చేసుకుంటున్నారని తెలిపారు. రైతులు దుకాణాలకు వెళ్లినప్పుడు “స్టాక్ అయిపోయింది” అంటూ పంపిస్తున్నారని, కానీ గోదాముల్లో మాత్రం నిల్వలు ఉన్నాయని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం సరఫరా లోపం చేయలేదని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్యవేక్షణలో విఫలమైందని అన్నారు. రైతులకు యూరియా అందకుండా ప్రైవేట్ కంపెనీలకు మళ్లించడం రైతు వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు

Sthanikam

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం

Article Image

బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి

రామన్నపేట మండలంలో యూరియా సరఫరాలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని బండ మధుకర్ రెడ్డి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అందాల్సిన యూరియా మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆయన విమర్శించారు.

ఎరువుల దుకాణాల యజమానులు కుమ్మక్కై రైతుల పాస్‌బుక్కులు ముందుగానే సేకరించి ఓటీపీ నమోదు చేసి యూరియాను బుక్‌ చేసుకుంటున్నారని తెలిపారు. రైతులు దుకాణాలకు వెళ్లినప్పుడు “స్టాక్ అయిపోయింది” అంటూ పంపిస్తున్నారని, కానీ గోదాముల్లో మాత్రం నిల్వలు ఉన్నాయని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం సరఫరా లోపం చేయలేదని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్యవేక్షణలో విఫలమైందని అన్నారు. రైతులకు యూరియా అందకుండా ప్రైవేట్ కంపెనీలకు మళ్లించడం రైతు వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News