బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి
రామన్నపేట మండలంలో యూరియా సరఫరాలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని బండ మధుకర్ రెడ్డి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అందాల్సిన యూరియా మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆయన విమర్శించారు.
ఎరువుల దుకాణాల యజమానులు కుమ్మక్కై రైతుల పాస్బుక్కులు ముందుగానే సేకరించి ఓటీపీ నమోదు చేసి యూరియాను బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. రైతులు దుకాణాలకు వెళ్లినప్పుడు “స్టాక్ అయిపోయింది” అంటూ పంపిస్తున్నారని, కానీ గోదాముల్లో మాత్రం నిల్వలు ఉన్నాయని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం సరఫరా లోపం చేయలేదని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్యవేక్షణలో విఫలమైందని అన్నారు. రైతులకు యూరియా అందకుండా ప్రైవేట్ కంపెనీలకు మళ్లించడం రైతు వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి