రామన్నపేట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మల్లికార్జున బిన్నీ రైస్ మిల్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ పాదయాత్రగా శోభాయాత్ర నిర్వహించారు.
ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని జీజాబాయి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపనకు భూమి పూజ నిర్వహించారు. తదుపరి విగ్రహ ఏర్పాటుకు కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సర్పంచ్ గరిక సత్యనారాయణను, అధ్యక్షుడిగా చొల్లేటి శివ కిరణ్ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సోషల్ మీడియా సభ్యులను నియమించారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి