Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:16 PM

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
February 05, 2026 01:47 PM 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్

రామన్నపేటలో న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.మొయినాబాద్‌లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు ఎండీ మజీద్ మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిరంతరం న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆస్తి కోసం ఇలాంటి దాడులు, హత్యలు చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించాల్సిందే తప్ప హింసకు పాల్పడకూడదని సూచించారు.ఈ సందర్భంగా యువ న్యాయవాది స్వప్న మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మశాంతి కోసం న్యాయవాదులు నిమిషం పాటు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు యాదాసు యాదయ్యతో పాటు సీనియర్ న్యాయవాదులు జినుకల ప్రభాకర్, కేమ రామదాసు, బసరాజు, అశోక్ కుమార్, జగతయ్య, శ్రీశైలం, కూనూరు శ్రీనివాస్, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News