Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 01:52 AM

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ

రామన్నపేటలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
February 05, 2026 01:47 PM 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్

రామన్నపేటలో న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.మొయినాబాద్‌లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు ఎండీ మజీద్ మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిరంతరం న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆస్తి కోసం ఇలాంటి దాడులు, హత్యలు చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించాల్సిందే తప్ప హింసకు పాల్పడకూడదని సూచించారు.ఈ సందర్భంగా యువ న్యాయవాది స్వప్న మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మశాంతి కోసం న్యాయవాదులు నిమిషం పాటు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు యాదాసు యాదయ్యతో పాటు సీనియర్ న్యాయవాదులు జినుకల ప్రభాకర్, కేమ రామదాసు, బసరాజు, అశోక్ కుమార్, జగతయ్య, శ్రీశైలం, కూనూరు శ్రీనివాస్, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News