Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:44 PM

రామన్నపేటలో న్యాయ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది

రామన్నపేటలో న్యాయ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది

రామన్నపేటలో న్యాయ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది
February 01, 2026 06:04 PM 251 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాలుగు కోర్టుల భవన సముదాయానికి శంకుస్థాపన

రామన్నపేటలో న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నాలుగు కోర్టుల భవన సముదాయానికి ఆదివారం మండలంలోని కోమ్మాయిగూడెం రోడ్డులో ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో న్యాయాన్ని తీసుకువచ్చే దిశగా ఇది కీలక ముందడుగుగా నిలుస్తోంది.జస్టిస్ పి శ్యామ్ కోసి కే శరత్ శంకుస్థాపన నిర్వహించగా, కోర్టుల మౌలిక సదుపాయాల విస్తరణతోన్యాయసేవలువేగవంతమవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవన సముదాయం త్వరితగతిన పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని జస్టిస్ కూనూరు లక్ష్మణ్ అధికారులకు సూచించారు. నిర్మాణ ప్రక్రియలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.న్యాయసేవలు ప్రజల గుమ్మం దాకా చేరాలన్న లక్ష్యంతో ప్రతి కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.


రామన్నపేటలో కోర్టుల భవన సముదాయం అందుబాటులోకి వస్తే పరిసర మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి, జస్టిస్ సృజన కళాసికం, జస్టిస్ నర్సింగరావు నందికొండ, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు రావు, జిల్లా ఎస్పీ అఖిలేష్, సీనియర్ సివిల్ జడ్జ్ సబిత, జూనియర్ సివిల్ జడ్జ్ శిరీష హాజరయ్యారు.బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, సీనియర్ న్యాయవాదులు యపల కృష్ణారెడ్డి, అశోక్ కుమార్, కంపాటి యాదగిరి, ఉపాధ్యక్షుడు యాదాసు యాదయ్య, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మోగులయ్య, జినుకల ప్రభాకర్, హనుమంతు గౌడ్, ప్యానల్ న్యాయవాది మామిడి వెంకటరెడ్డి, ప్రభుత్వ అభియోగ అధికారి సుక్క శ్రవణ్ కుమార్, బి అశోక్ కుమార్, జగతయ్య, డేవిడ్ బాలరాజు, శ్రీశైలం స్వామి, రమేష్, అజీజ్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.






మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News