Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 05:30 AM

రామన్నపేటలో కల్తీ యూరియా కలకలం. రైతులను మోసం చేస్తున్న డీలర్లు?

రామన్నపేటలో కల్తీ యూరియా కలకలం. రైతులను మోసం చేస్తున్న డీలర్లు?

రామన్నపేటలో కల్తీ యూరియా కలకలం. రైతులను మోసం చేస్తున్న డీలర్లు?
21-02-2026 185 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేత నరేష్ డిమాండ్


రామన్నపేట: జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వేళ, రామన్నపేట మండలంలో కల్తీ యూరియా వ్యవహారం బయటపడటం కలకలం రేపుతోంది. బీఎస్పీ మండల అధ్యక్షుడు నకిరేకంటి నరేష్ ఆరోపణలతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆన్లైన్‌లో బుక్ చేసుకుని రామన్నపేటలోని ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన యూరియా నకిలీగా ఉన్నట్లు కొమ్మాయిగూడానికి చెందిన రైతులు నరసింహ, గణేష్ ఫిర్యాదు చేశారు. ఇటీవల 6 బస్తాలు కొనుగోలు చేసి అందులో 3 బస్తాలు తెరిచి చూడగా, యూరియా బదులుగా నల్లటి మట్టి పెళ్లలు కనిపించాయని వారు ఆరోపించారు.

ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని నరేష్ పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీ పేరుతో ఉన్న బస్తాల్లో ఇలా కల్తీ పదార్థం ఉండటం ఆందోళనకరమని అన్నారు. అదేవిధంగా బస్తాల బరువు కూడా తక్కువగా ఉన్నట్లు రైతులు వాపోయారని తెలిపారు.

జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ షాపులను తనిఖీ చేసి అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని నరేష్ డిమాండ్ చేశారు.

Sthanikam

రామన్నపేటలో కల్తీ యూరియా కలకలం. రైతులను మోసం చేస్తున్న డీలర్లు?

Article Image

కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేత నరేష్ డిమాండ్


రామన్నపేట: జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న వేళ, రామన్నపేట మండలంలో కల్తీ యూరియా వ్యవహారం బయటపడటం కలకలం రేపుతోంది. బీఎస్పీ మండల అధ్యక్షుడు నకిరేకంటి నరేష్ ఆరోపణలతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆన్లైన్‌లో బుక్ చేసుకుని రామన్నపేటలోని ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన యూరియా నకిలీగా ఉన్నట్లు కొమ్మాయిగూడానికి చెందిన రైతులు నరసింహ, గణేష్ ఫిర్యాదు చేశారు. ఇటీవల 6 బస్తాలు కొనుగోలు చేసి అందులో 3 బస్తాలు తెరిచి చూడగా, యూరియా బదులుగా నల్లటి మట్టి పెళ్లలు కనిపించాయని వారు ఆరోపించారు.

ఈ విషయాన్ని తాను స్వయంగా పరిశీలించానని నరేష్ పేర్కొన్నారు. ప్రముఖ కంపెనీ పేరుతో ఉన్న బస్తాల్లో ఇలా కల్తీ పదార్థం ఉండటం ఆందోళనకరమని అన్నారు. అదేవిధంగా బస్తాల బరువు కూడా తక్కువగా ఉన్నట్లు రైతులు వాపోయారని తెలిపారు.

జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ షాపులను తనిఖీ చేసి అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని నరేష్ డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News