Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న వై. పండరి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:23 PM

రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం
05-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యోగా శక్తితో యువతలో ఆరోగ్య చైతన్యం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ముప్పై రోజుల యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతంగా ముగిసింది. శారీరక విద్య, భౌతిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం విద్యార్థుల్లో విశేష స్పందనను రాబట్టింది. కళాశాల శారీరక విద్యాధికారి డాక్టర్ ఎం. రవీందర్ రావు, విద్యా సమన్వయకర్త డాక్టర్ చిన్నబాబు పర్యవేక్షణలో కోర్సు కొనసాగింది.కోర్సులో పాల్గొన్న విద్యార్థులు యోగాసనాల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాహత్ ఖానం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, రోజువారీ జీవితంలో యోగా కీలకమని పేర్కొన్నారు. నిత్యం యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. యువత ఆరోగ్యవంతమైన జీవనానికి యోగాను అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుడు హరికృష్ణ విద్యార్థులతో యోగాసనాలు చేయించి యోగా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

Sthanikam

రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం

Article Image

యోగా శక్తితో యువతలో ఆరోగ్య చైతన్యం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ముప్పై రోజుల యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతంగా ముగిసింది. శారీరక విద్య, భౌతిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం విద్యార్థుల్లో విశేష స్పందనను రాబట్టింది. కళాశాల శారీరక విద్యాధికారి డాక్టర్ ఎం. రవీందర్ రావు, విద్యా సమన్వయకర్త డాక్టర్ చిన్నబాబు పర్యవేక్షణలో కోర్సు కొనసాగింది.కోర్సులో పాల్గొన్న విద్యార్థులు యోగాసనాల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాహత్ ఖానం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, రోజువారీ జీవితంలో యోగా కీలకమని పేర్కొన్నారు. నిత్యం యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. యువత ఆరోగ్యవంతమైన జీవనానికి యోగాను అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుడు హరికృష్ణ విద్యార్థులతో యోగాసనాలు చేయించి యోగా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News