రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం
రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం
స్థానికం బృందం
యోగా శక్తితో యువతలో ఆరోగ్య చైతన్యం
రామన్నపేట డిగ్రీ కళాశాలలో ముప్పై రోజుల యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతంగా ముగిసింది. శారీరక విద్య, భౌతిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం విద్యార్థుల్లో విశేష స్పందనను రాబట్టింది. కళాశాల శారీరక విద్యాధికారి డాక్టర్ ఎం. రవీందర్ రావు, విద్యా సమన్వయకర్త డాక్టర్ చిన్నబాబు పర్యవేక్షణలో కోర్సు కొనసాగింది.కోర్సులో పాల్గొన్న విద్యార్థులు యోగాసనాల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాహత్ ఖానం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, రోజువారీ జీవితంలో యోగా కీలకమని పేర్కొన్నారు. నిత్యం యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. యువత ఆరోగ్యవంతమైన జీవనానికి యోగాను అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుడు హరికృష్ణ విద్యార్థులతో యోగాసనాలు చేయించి యోగా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి