Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:25 PM

రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతం. రాహత్ ఖానం
February 05, 2026 05:13 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యోగా శక్తితో యువతలో ఆరోగ్య చైతన్యం

రామన్నపేట డిగ్రీ కళాశాలలో ముప్పై రోజుల యోగా సర్టిఫికెట్ కోర్సు విజయవంతంగా ముగిసింది. శారీరక విద్య, భౌతిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం విద్యార్థుల్లో విశేష స్పందనను రాబట్టింది. కళాశాల శారీరక విద్యాధికారి డాక్టర్ ఎం. రవీందర్ రావు, విద్యా సమన్వయకర్త డాక్టర్ చిన్నబాబు పర్యవేక్షణలో కోర్సు కొనసాగింది.కోర్సులో పాల్గొన్న విద్యార్థులు యోగాసనాల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాహత్ ఖానం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, రోజువారీ జీవితంలో యోగా కీలకమని పేర్కొన్నారు. నిత్యం యోగాభ్యాసం చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. యువత ఆరోగ్యవంతమైన జీవనానికి యోగాను అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుడు హరికృష్ణ విద్యార్థులతో యోగాసనాలు చేయించి యోగా ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News