Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

రామన్నపేట డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు

రామన్నపేట డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు

రామన్నపేట డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు
07-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా అధ్యాపకులకు ఘన సన్మానం

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత కమిటీ కోఆర్డినేటర్ డా. జి. సునీత, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎం. అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫ్. రహత్ ఖానం అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మహిళలు విద్య, ఉద్యోగం, నాయకత్వ రంగాల్లో ముందుకు సాగి సమానత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా మహిళా అధ్యాపకులను స్టాఫ్ క్లబ్ తరఫున ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు డా. కృష్ణ కౌండిన్య, డా. లక్ష్మీ నీలిమ, డా. వెంకటేశ్వర్లు, డా. కిషన్, డా. శ్రీనివాస్, డా. బ్రహ్మం, డా. రత్నమంజుల, నరేష్, రాధిక, రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు

Article Image

మహిళా అధ్యాపకులకు ఘన సన్మానం

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత కమిటీ కోఆర్డినేటర్ డా. జి. సునీత, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎం. అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫ్. రహత్ ఖానం అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మహిళలు విద్య, ఉద్యోగం, నాయకత్వ రంగాల్లో ముందుకు సాగి సమానత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా మహిళా అధ్యాపకులను స్టాఫ్ క్లబ్ తరఫున ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు డా. కృష్ణ కౌండిన్య, డా. లక్ష్మీ నీలిమ, డా. వెంకటేశ్వర్లు, డా. కిషన్, డా. శ్రీనివాస్, డా. బ్రహ్మం, డా. రత్నమంజుల, నరేష్, రాధిక, రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News