రమాభాయి నేటి తరానికి ఆదర్శం
రమాభాయి నేటి తరానికి ఆదర్శం
స్థానికం బృందం
ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాభాయి నేటి తరం తప్పనిసరిగా ఆదర్శంగా తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.
రమాభాయి జయంతి సందర్భంగా శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రమాభాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బట్టు రామచంద్రయ్య, కొడారి వెంకటేష్, బర్రె సుదర్శన్, ఇటుకల దేవేందర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్య కోసం అంబేద్కర్కు తన కష్టార్జితాన్ని పంపి సహకరించిన త్యాగమూర్తి రమాభాయి అని గుర్తు చేశారు. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కు, ఆస్తి హక్కులు రాజ్యాంగంలో పొందుపరచడంలో రమాభాయి స్ఫూర్తి, ప్రేరణ కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భానోతు భాస్కర్ నాయక్, పల్లెర్ల వెంకటేశం, బాకారం లావణ్య, నల్ల కృష్ణ, దుబ్బాక రామకృష్ణ, బోడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి