Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 22, 2026 08:56 AM

రాజమండ్రిలో తెలంగాణ 108… నిబంధనల ఉల్లంఘనపై చర్చ

రాజమండ్రిలో తెలంగాణ 108… నిబంధనల ఉల్లంఘనపై చర్చ

రాజమండ్రిలో తెలంగాణ 108… నిబంధనల ఉల్లంఘనపై చర్చ
March 22, 2026 07:19 AM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
ఎడిటోరియల్ టీమ్

అత్యవసర సేవలకు కేటాయించిన 108 అంబులెన్స్ పక్క రాష్ట్రంలో ప్రత్యక్షమవ్వడం వివాదాస్పదమైంది. హైదరాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన వాహనం నిజాంపేట్ మార్గంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చేరినట్లు జీపీఎస్ ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా 108 సేవలు రాష్ట్ర పరిధిలోనే ఉండాలని నిబంధనలు పేర్కొంటాయి. అలాంటప్పుడు వాహనం ఇతర రాష్ట్రానికి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. ఇది రోగి తరలింపుకోసమా? లేక ఇతర కారణాల కోసమా? అన్నది స్పష్టత లేని అంశంగా మారింది.

ఈ విషయంపై అంబులెన్స్ సిబ్బందిని సంప్రదించగా, వాహనం రాజమండ్రిలో ఉన్న విషయం నిజమేనని అంగీకరించినప్పటికీ, పై అధికారుల ఆదేశాలపై వివరాలు తెలియదని తెలిపారు.

ఇక, స్థానికంగా అత్యవసర సేవలు అవసరమైన సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోతే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై 108 ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News