Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:04 PM

రాజమండ్రిలో తెలంగాణ 108… నిబంధనల ఉల్లంఘనపై చర్చ

రాజమండ్రిలో తెలంగాణ 108… నిబంధనల ఉల్లంఘనపై చర్చ

రాజమండ్రిలో తెలంగాణ 108… నిబంధనల ఉల్లంఘనపై చర్చ
22-03-2026 169 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అత్యవసర సేవలకు కేటాయించిన 108 అంబులెన్స్ పక్క రాష్ట్రంలో ప్రత్యక్షమవ్వడం వివాదాస్పదమైంది. హైదరాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన వాహనం నిజాంపేట్ మార్గంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చేరినట్లు జీపీఎస్ ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా 108 సేవలు రాష్ట్ర పరిధిలోనే ఉండాలని నిబంధనలు పేర్కొంటాయి. అలాంటప్పుడు వాహనం ఇతర రాష్ట్రానికి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. ఇది రోగి తరలింపుకోసమా? లేక ఇతర కారణాల కోసమా? అన్నది స్పష్టత లేని అంశంగా మారింది.

ఈ విషయంపై అంబులెన్స్ సిబ్బందిని సంప్రదించగా, వాహనం రాజమండ్రిలో ఉన్న విషయం నిజమేనని అంగీకరించినప్పటికీ, పై అధికారుల ఆదేశాలపై వివరాలు తెలియదని తెలిపారు.

ఇక, స్థానికంగా అత్యవసర సేవలు అవసరమైన సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోతే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై 108 ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

రాజమండ్రిలో తెలంగాణ 108… నిబంధనల ఉల్లంఘనపై చర్చ

Article Image

అత్యవసర సేవలకు కేటాయించిన 108 అంబులెన్స్ పక్క రాష్ట్రంలో ప్రత్యక్షమవ్వడం వివాదాస్పదమైంది. హైదరాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన వాహనం నిజాంపేట్ మార్గంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చేరినట్లు జీపీఎస్ ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా 108 సేవలు రాష్ట్ర పరిధిలోనే ఉండాలని నిబంధనలు పేర్కొంటాయి. అలాంటప్పుడు వాహనం ఇతర రాష్ట్రానికి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. ఇది రోగి తరలింపుకోసమా? లేక ఇతర కారణాల కోసమా? అన్నది స్పష్టత లేని అంశంగా మారింది.

ఈ విషయంపై అంబులెన్స్ సిబ్బందిని సంప్రదించగా, వాహనం రాజమండ్రిలో ఉన్న విషయం నిజమేనని అంగీకరించినప్పటికీ, పై అధికారుల ఆదేశాలపై వివరాలు తెలియదని తెలిపారు.

ఇక, స్థానికంగా అత్యవసర సేవలు అవసరమైన సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోతే బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై 108 ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 6 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News