PRINT TIME: April 17, 2026 11:21 PM
రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ
రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ
April 17, 2026 09:29 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు అప్పుల బాధలు తాళలేక 16/11/2024 ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకి భార్య,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైతు భార్య అయినటువంటి నాగమణి కూలీ చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండగా, వీరిని గుర్తించిన మన రెడ్స్ సంస్థ వారు ఆమె జీవనోపాధి కోసం 17/4/2026 శుక్రవారం పాలు ఇచ్చు ఆవును,వారి జీవనార్థం కోసం ఆర్థిక సహాయంగా అందించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ నా భర్త అయినటువంటి శ్రీనివాస్ చనిపోయిన అప్పటినుండి కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదని, మమ్మల్ని గుర్తించి మా జీవనానికి ఆర్థిక సహాయం అందించిన రెడ్స్ సంస్థ డైరెక్టర్ భానూజ మేడం గారికి,సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి