రామన్నపేట స్థానికం ప్రతినిధి
శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రామన్నపేట ఏరియా హాస్పిటల్ను 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సభలో ప్రస్తావించడంతో రామన్నపేట ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు రెబ్బాసు రాములు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రామన్నపేటకు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న హాస్పిటల్ అభివృద్ధి అంశంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే 2026 నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో రామన్నపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి