పువ్వులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ నరసింహ
పువ్వులు అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ నరసింహ
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలు ఆనందంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారు క్షేమంగా వెళ్లి సంక్రాంతి పండుగను ఆనందంగా చేసుకోవాలని, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ సూచించారు. ముఖ్యంగా రహదారి ప్రయాణాల్లో వేగ నియంత్రణ పాటిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.సంక్రాంతి పండుగ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, పండుగ వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. ఎస్పీ నరసింహ గారి ఈ చర్య ప్రజల్లో సానుకూల స్పందనను పొందింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి