ప్రసూతి సెలవుల తర్వాత పీజీ మెడికల్ విద్యార్థినులకు ఫీజు మాఫీ
ప్రసూతి సెలవుల తర్వాత పీజీ మెడికల్ విద్యార్థినులకు ఫీజు మాఫీ
Deshamkosam
స్థానికం ప్రతినిధి: దేశం కోసం
ప్రసూతి సెలవుల అనంతరం చదువులు తిరిగి ప్రారంభించే పీజీ మెడికల్ విద్యార్థినులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. మేటర్నిటీ లీవ్ తీసుకున్న కారణంగా తిరిగి చేరే సమయంలో చెల్లించాల్సిన రూ.15,000 రీ అడ్మిషన్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య కొనసాగిస్తున్న మహిళా డాక్టర్లకు ఆర్థిక భారం తగ్గనుంది. ప్రసూతి కారణంగా కొంతకాలం విద్యకు విరామం తీసుకున్నప్పటికీ, తిరిగి చదువులు కొనసాగించేందుకు ఎలాంటి ఆర్థిక అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వైద్య విద్య శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు ప్రసూతి సెలవుల తర్వాత పీజీ కోర్సుల్లో తిరిగి చేరే సమయంలో రీ అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి రావడం వల్ల పలువురు విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకుని, మహిళా సాధికారతకు తోడ్పడేలా ఈ ఫీజు మాఫీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో మహిళా డాక్టర్లు నిర్బంధాలు లేకుండా తమ వైద్య విద్యను కొనసాగించగలరని, భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించే నిపుణులుగా ఎదగడానికి ఇది దోహదపడుతుందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి