Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:53 AM

పోతిరెడ్డిపాడు – రాయలసీమ సాగునీటి అంశంపై మీనాక్షి నాయుడు వ్యాఖ్యలు

పోతిరెడ్డిపాడు – రాయలసీమ సాగునీటి అంశంపై మీనాక్షి నాయుడు వ్యాఖ్యలు

పోతిరెడ్డిపాడు – రాయలసీమ సాగునీటి అంశంపై మీనాక్షి నాయుడు వ్యాఖ్యలు
February 04, 2026 07:20 AM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

రాయలసీమ ప్రాంత సాగునీటి అంశంపై పోతిరెడ్డిపాడు వద్ద జరుగుతున్న పరిణామాలపై ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మీనాక్షి నాయుడు స్పందించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగునీటి పరిస్థితిని వివరిస్తూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం సాగునీటి కొరత లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న కాలువలు, జలాశయాలు, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు క్షేత్రస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉందని తెలిపారు.

రాయలసీమకు నీరు అందించాలనే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పునఃప్రారంభించాలనే ప్రచారంపై స్పందిస్తూ, ప్రస్తుతం అమలులో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే రైతులకు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.12,441 కోట్ల విలువైన సాగునీటి పనులను పూర్తి చేసి, పునరుద్ధరించడంతో రైతులకు సాగునీటి లభ్యతపై భరోసా ఏర్పడిందని ఆయన తెలిపారు.రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి రైతుకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని మీనాక్షి నాయుడు పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News