Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:25 PM

పోతిరెడ్డిపాడు – రాయలసీమ సాగునీటి అంశంపై మీనాక్షి నాయుడు వ్యాఖ్యలు

పోతిరెడ్డిపాడు – రాయలసీమ సాగునీటి అంశంపై మీనాక్షి నాయుడు వ్యాఖ్యలు

పోతిరెడ్డిపాడు – రాయలసీమ సాగునీటి అంశంపై మీనాక్షి నాయుడు వ్యాఖ్యలు
February 04, 2026 07:20 AM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాయలసీమ ప్రాంత సాగునీటి అంశంపై పోతిరెడ్డిపాడు వద్ద జరుగుతున్న పరిణామాలపై ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మీనాక్షి నాయుడు స్పందించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగునీటి పరిస్థితిని వివరిస్తూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం సాగునీటి కొరత లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న కాలువలు, జలాశయాలు, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు క్షేత్రస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉందని తెలిపారు.

రాయలసీమకు నీరు అందించాలనే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పునఃప్రారంభించాలనే ప్రచారంపై స్పందిస్తూ, ప్రస్తుతం అమలులో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే రైతులకు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.12,441 కోట్ల విలువైన సాగునీటి పనులను పూర్తి చేసి, పునరుద్ధరించడంతో రైతులకు సాగునీటి లభ్యతపై భరోసా ఏర్పడిందని ఆయన తెలిపారు.రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి రైతుకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని మీనాక్షి నాయుడు పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News