Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:21 PM

పోతిరెడ్డిపాడు – రాయలసీమ సాగునీటి అంశంపై మీనాక్షి నాయుడు వ్యాఖ్యలు

పోతిరెడ్డిపాడు – రాయలసీమ సాగునీటి అంశంపై మీనాక్షి నాయుడు వ్యాఖ్యలు

పోతిరెడ్డిపాడు – రాయలసీమ సాగునీటి అంశంపై మీనాక్షి నాయుడు వ్యాఖ్యలు
February 04, 2026 07:20 AM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాయలసీమ ప్రాంత సాగునీటి అంశంపై పోతిరెడ్డిపాడు వద్ద జరుగుతున్న పరిణామాలపై ఆదోని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మీనాక్షి నాయుడు స్పందించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగునీటి పరిస్థితిని వివరిస్తూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.రాయలసీమ ప్రాంతంలో ప్రస్తుతం సాగునీటి కొరత లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న కాలువలు, జలాశయాలు, ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు క్షేత్రస్థాయిలో సాగునీరు అందుబాటులో ఉందని తెలిపారు.

రాయలసీమకు నీరు అందించాలనే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పునఃప్రారంభించాలనే ప్రచారంపై స్పందిస్తూ, ప్రస్తుతం అమలులో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే రైతులకు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.12,441 కోట్ల విలువైన సాగునీటి పనులను పూర్తి చేసి, పునరుద్ధరించడంతో రైతులకు సాగునీటి లభ్యతపై భరోసా ఏర్పడిందని ఆయన తెలిపారు.రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి రైతుకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని మీనాక్షి నాయుడు పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News