Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:14 AM

పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష కీలకం: డా. సిహెచ్ శ్యాంసుందర్

పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష కీలకం: డా. సిహెచ్ శ్యాంసుందర్

పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష కీలకం: డా. సిహెచ్ శ్యాంసుందర్
February 23, 2026 02:55 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించటం అనివార్యమని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకులు డా. సిహెచ్. శ్యాంసుందర్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో “పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష ప్రాధాన్యత” అంశంపై నిర్వహించిన అతిథి ఉపన్యాసంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు.

అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందిన ఆంగ్లానికి నేటి విద్యా, ఉపాధి రంగాల్లో ప్రత్యేక స్థానం ఉన్నదని ఆయన వివరించారు. గ్రూప్ డిస్కషన్లు, ఇంటర్వ్యూల్లో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది భాషా ప్రావీణ్యమేనని పేర్కొన్నారు. పదసంపద పెంపు, వ్యాకరణంపై పట్టు, కమ్యూనికేషన్ నైపుణ్యాల సాధన ద్వారా పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, ఆంగ్ల భాషలో నైపుణ్యం ఉన్నవారికి దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని అన్నారు. విద్యార్థులు నిరంతర సాధనతో భాషా దిట్టలుగా మారాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి డా. ఎం. లక్ష్మీ నీలిమ, అధ్యాపకురాలు రాధికతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపన్యాసం అనంతరం విద్యార్థులతో పరస్పర చర్చ నిర్వహించగా, పోటీ పరీక్షలపై పలు సందేహాలకు సమాధానాలు లభించాయి.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News