Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:39 AM

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
February 07, 2026 04:16 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల ఓటు హక్కు తప్పక వినియోగించాలి

ఫిబ్రవరి 8, 9న జిల్లావ్యాప్తంగా సౌకర్యం

మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు.

జిల్లాలో ఫిబ్రవరి 8, 9 తేదీలలో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధుల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లుగా ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ ఎన్నికల విధి ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు, పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసిన ఫారం–12తో సంబంధిత సౌకర్య కేంద్రానికి హాజరుకావాలని తెలిపారు. సౌకర్య కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసి, వెంటనే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

అధికారులు ఓటు వేసిన అనంతరం సంతకం చేసిన పోస్టల్ బ్యాలెట్‌ను అదే రోజు అదే సౌకర్య కేంద్రంలో సమర్పించాల్సిందిగా తెలిపారు. ప్రతి ఎన్నికల సిబ్బంది తన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News