పోస్టల్ బ్యాలెట్కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
పోస్టల్ బ్యాలెట్కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
స్థానికం బృందం
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల ఓటు హక్కు తప్పక వినియోగించాలి
ఫిబ్రవరి 8, 9న జిల్లావ్యాప్తంగా సౌకర్యం
మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు.
జిల్లాలో ఫిబ్రవరి 8, 9 తేదీలలో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధుల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లుగా ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ ఎన్నికల విధి ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు, పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసిన ఫారం–12తో సంబంధిత సౌకర్య కేంద్రానికి హాజరుకావాలని తెలిపారు. సౌకర్య కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసి, వెంటనే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
అధికారులు ఓటు వేసిన అనంతరం సంతకం చేసిన పోస్టల్ బ్యాలెట్ను అదే రోజు అదే సౌకర్య కేంద్రంలో సమర్పించాల్సిందిగా తెలిపారు. ప్రతి ఎన్నికల సిబ్బంది తన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి