Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:08 PM

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
February 07, 2026 04:16 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల ఓటు హక్కు తప్పక వినియోగించాలి

ఫిబ్రవరి 8, 9న జిల్లావ్యాప్తంగా సౌకర్యం

మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు.

జిల్లాలో ఫిబ్రవరి 8, 9 తేదీలలో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధుల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లుగా ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ ఎన్నికల విధి ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు, పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసిన ఫారం–12తో సంబంధిత సౌకర్య కేంద్రానికి హాజరుకావాలని తెలిపారు. సౌకర్య కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసి, వెంటనే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

అధికారులు ఓటు వేసిన అనంతరం సంతకం చేసిన పోస్టల్ బ్యాలెట్‌ను అదే రోజు అదే సౌకర్య కేంద్రంలో సమర్పించాల్సిందిగా తెలిపారు. ప్రతి ఎన్నికల సిబ్బంది తన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News