Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:33 PM

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు
07-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల ఓటు హక్కు తప్పక వినియోగించాలి

ఫిబ్రవరి 8, 9న జిల్లావ్యాప్తంగా సౌకర్యం

మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు.

జిల్లాలో ఫిబ్రవరి 8, 9 తేదీలలో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధుల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లుగా ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ ఎన్నికల విధి ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు, పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసిన ఫారం–12తో సంబంధిత సౌకర్య కేంద్రానికి హాజరుకావాలని తెలిపారు. సౌకర్య కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసి, వెంటనే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

అధికారులు ఓటు వేసిన అనంతరం సంతకం చేసిన పోస్టల్ బ్యాలెట్‌ను అదే రోజు అదే సౌకర్య కేంద్రంలో సమర్పించాల్సిందిగా తెలిపారు. ప్రతి ఎన్నికల సిబ్బంది తన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.

Sthanikam

పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల ఓటు హక్కు తప్పక వినియోగించాలి

ఫిబ్రవరి 8, 9న జిల్లావ్యాప్తంగా సౌకర్యం

మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ప్రత్యేక సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు.

జిల్లాలో ఫిబ్రవరి 8, 9 తేదీలలో భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ పరిధుల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లుగా ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తమ ఎన్నికల విధి ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు, పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసిన ఫారం–12తో సంబంధిత సౌకర్య కేంద్రానికి హాజరుకావాలని తెలిపారు. సౌకర్య కేంద్రంలోనే పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసి, వెంటనే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

అధికారులు ఓటు వేసిన అనంతరం సంతకం చేసిన పోస్టల్ బ్యాలెట్‌ను అదే రోజు అదే సౌకర్య కేంద్రంలో సమర్పించాల్సిందిగా తెలిపారు. ప్రతి ఎన్నికల సిబ్బంది తన ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News