Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:19 PM

పోలీసుల శ్రమ ఫలించింది… తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ లభ్యం

పోలీసుల శ్రమ ఫలించింది… తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ లభ్యం

పోలీసుల శ్రమ ఫలించింది… తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ లభ్యం
February 06, 2026 06:40 AM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తప్పిపోయిన విద్యార్థి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు

తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం

ఎవరికి చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయిన

విద్యార్థి ఆచూకీని గుర్తించిన నార్కెట్‌పల్లి పోలీసులు, అతడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి వారి ఆవేదనను తీర్చారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నార్కెట్‌పల్లి బీసీ హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న నూకల శశాంక్ (15) (తండ్రి: లేట్ నరసింహ, కులం: యాదవ్, గ్రామం: అన్నెపర్తి, నల్లగొండ జిల్లా) బుధవారం ఉదయం హాస్టల్ నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించి, కలిసి గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.

దీంతో అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నార్కెట్‌పల్లి ఎస్సై పి. విష్ణుమూర్తి, బాలుడి ఆచూకీ కోసం కానిస్టేబుళ్లు సత్యనారాయణ, గిరిబాబులను నియమించారు. వారు శోధన కొనసాగిస్తూ గురువారం ఉదయం 9 గంటల సమయంలో భువనగిరి బస్టాండ్‌లో బాలుడిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.ఎస్సై సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి ఆచూకీని వేగంగా గుర్తించిన కానిస్టేబుళ్లను ఎస్సై అభినందించారు. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకుపాల్పడకూడదని విద్యార్థికి సూచనలు ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News