Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 09:54 PM

పోలవరం రైతు సంఘం నాయకుని మనవరాలు వినూత్న రాజశ్రీ భరత నాట్య కీర్తి

పోలవరం రైతు సంఘం నాయకుని మనవరాలు వినూత్న రాజశ్రీ భరత నాట్య కీర్తి

పోలవరం రైతు సంఘం నాయకుని మనవరాలు వినూత్న రాజశ్రీ భరత నాట్య కీర్తి
February 24, 2026 08:03 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికపై మెరిసిన వినూత్న రాజశ్రీ

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు చాగంటి రాజారావు మనవరాలు, 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వినూత్న రాజశ్రీ ప్రతిభకు రాష్ట్రస్థాయిలో ప్రశంసలు లభించాయి.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించిన “భరత నాట్య వైభవం” కార్యక్రమంలో ఆమె అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మొత్తం 108 మంది చిన్నారులు పాల్గొని మూడు గంటలపాటు సాగిన ఈ నృత్య మహోత్సవంలో

వినూత్న రాజశ్రీ తన లయ, భావ వ్యక్తీకరణ, నాట్య నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె ప్రదర్శనకు సభలోని ప్రముఖులు, కళాభిమానులు ప్రశంసలు కురిపించారు.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన చిన్నారి రాష్ట్ర రాజధానిలోని ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రతిభ చాటడం స్థానికులకు గర్వకారణంగా మారింది. గ్రామ పెద్దలు, బీజేపీ ఏలూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాగంటి వాసుదేవ రావు, రైతు సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు ఆమెకు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News