ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ నోటీసులపై కేసీఆర్ రిప్లై
ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ నోటీసులపై కేసీఆర్ రిప్లై
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లిఖితపూర్వకంగా స్పందించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పూర్తిగా బిజీగా ఉన్న కారణంగా, విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల షెడ్యూల్ కారణంగా సిట్ ముందు హాజరుకాలేనని పేర్కొన్న కేసీఆర్, విచారణకు హాజరు కావడానికి మరో తేదీని ఖరారు చేయాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 160 ప్రకారం, 65 ఏళ్లు దాటిన వ్యక్తులను పోలీస్ స్టేషన్కు పిలవకూడదన్న చట్ట నిబంధనలను ఆయన గుర్తు చేశారు. తన వయస్సు 65 ఏళ్లు దాటిన నేపథ్యంలో, ఇంటివద్దే విచారణ జరపాలని కోరారు.
ప్రస్తుతం తాను సిద్ధిపేట జిల్లా మార్కుక్ మండలం ఎరవల్లి గ్రామంలో నివాసం ఉంటున్నట్టు తెలిపారు. అవసరమైతే అక్కడికే వచ్చి విచారణ నిర్వహించాలని సిట్ను కోరారు.
భవిష్యత్తులో జారీ చేసే నోటీసులన్నీ తన నివాస చిరునామాకే పంపాలని కూడా కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి