ఫ్రీగా హెచ్పీవీ వ్యాక్సిన్ రాష్ట్రంలో మూడు నెలల డ్రైవ్ ప్రారంభం
ఫ్రీగా హెచ్పీవీ వ్యాక్సిన్ రాష్ట్రంలో మూడు నెలల డ్రైవ్ ప్రారంభం
స్థానికం బృందం
హైదరాబాద్,: గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది. నేటి నుంచి మూడు నెలల పాటు 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
మొదటి నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు)లోనూ టీకాలు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన వ్యాక్సిన్ నిల్వలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ టీకా వేయించుకోవడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ బాలికలను సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి టీకా వేయించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి