Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్ పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 07:43 PM

ఫేస్ యాప్ విధానంపై గుడిపల్లిలో కూలీల ఆగ్రహం

ఫేస్ యాప్ విధానంపై గుడిపల్లిలో కూలీల ఆగ్రహం

ఫేస్ యాప్ విధానంపై గుడిపల్లిలో కూలీల ఆగ్రహం
April 09, 2026 11:17 AM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు గురువారం నిరసన చేపట్టారు. పని ప్రదేశంలో ఫేస్ యాప్ ఫోటోలు తీసే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, ఫేస్ యాప్ విధానం వల్ల కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్లు ఇవ్వడంతో పాటు, కూలీలకు అవసరమైన పనిముట్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసనలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్న, మేట్లు శ్రీనివాస్, చంద్రకళ, రంగనాథ్, వెంకట రమణమ్మ, గంగరత్నమ్మ, గాయిత్రి, ఎస్. శ్రీనివాస్, అచ్యుత, కలావతి పాల్గొన్నారు. అలాగే కూలీలు రామాంజనేయులు, రంగనాథ్, రామప్ప, చంద్ర తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసనకు మద్దతు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News