ఫేస్ యాప్ విధానంపై గుడిపల్లిలో కూలీల ఆగ్రహం
ఫేస్ యాప్ విధానంపై గుడిపల్లిలో కూలీల ఆగ్రహం
Prakash
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు గురువారం నిరసన చేపట్టారు. పని ప్రదేశంలో ఫేస్ యాప్ ఫోటోలు తీసే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, ఫేస్ యాప్ విధానం వల్ల కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేట్లకు ఉచితంగా సెల్ ఫోన్లు ఇవ్వడంతో పాటు, కూలీలకు అవసరమైన పనిముట్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసనలో సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్న, మేట్లు శ్రీనివాస్, చంద్రకళ, రంగనాథ్, వెంకట రమణమ్మ, గంగరత్నమ్మ, గాయిత్రి, ఎస్. శ్రీనివాస్, అచ్యుత, కలావతి పాల్గొన్నారు. అలాగే కూలీలు రామాంజనేయులు, రంగనాథ్, రామప్ప, చంద్ర తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసనకు మద్దతు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి