పీవీసీ పైపుల తయారీ విధానంపై ప్రత్యక్ష అవగాహన
పీవీసీ పైపుల తయారీ విధానంపై ప్రత్యక్ష అవగాహన
స్థానికం బృందం
ఎన్ జి కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన
నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం ఆర్మాల బాలి ప్రాంతంలో నెలకొల్పిన నిధి పీవీసీ పైపుల తయారీ పరిశ్రమను క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పైపుల తయారీలో జరిగే వివిధ దశలను పరిశీలించి, పరిశ్రమ యాజమాన్యం మరియు సాంకేతిక నిపుణులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. తయారీ ప్రక్రియకు సంబంధించిన సందేహాలను పరిశ్రమ అధికారులు నివృత్తి చేశారు.తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో అవగాహన చేసుకునే ఉద్దేశంతో ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు రసాయన శాస్త్ర విభాగాధ్యక్షుడు అంతటి శ్రీనివాస్ తెలిపారు.పైపుల తయారీలో ఉపయోగించే రెసిన్తో పాటు ఇతర రసాయన పదార్థాలను ఏ నిష్పత్తిలో కలుపుతారో విద్యార్థులు పరిశీలించారు. మిశ్రమాన్ని వేడి చేసి యంత్రాల ద్వారా పైపు ఆకారం ఎలా రూపుదిద్దుకుంటుందో ఉత్పత్తి ప్రక్రియను ప్రత్యక్షంగా చూశారు. తయారైన పైపుల దృఢత్వం, నాణ్యత నియంత్రణ పరీక్షల విధానాలను సాంకేతిక నిపుణులు వివరించారు.
అలాగే పరిశ్రమలో వ్యర్థాల నిర్వహణ, పర్యావరణానికి హాని కలగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై విద్యార్థులు అవగాహన పొందారు.
ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉందని, పారిశ్రామిక రంగంపై అవగాహన పెంపొందించుకోవడానికి ఇలాంటి సందర్శనలు ఉపయోగపడతాయని కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.ఈ పర్యటనలో వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, అధ్యాపకులు బి. వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి