Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 12:56 AM

పెండింగ్ లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలి: కలెక్టర్ హనుమంతరావు

పెండింగ్ లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలి: కలెక్టర్ హనుమంతరావు

పెండింగ్ లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలి: కలెక్టర్ హనుమంతరావు
February 24, 2026 08:06 AM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం – అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

యాదాద్రి భువనగిరి: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ఆయన వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన మొత్తం 54 అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రజావాణిలో అందిన అర్జీలలో రెవిన్యూ శాఖకు 26, పంచాయతీ శాఖకు 7, ఇరిగేషన్‌కు 5, విద్యుత్ శాఖకు 3, ఎంప్లాయిమెంట్ టీమ్‌కు 3, వ్యవసాయ శాఖకు 2, ఈఈ డివిజన్‌కు 2, మున్సిపాలిటీకి 2, గ్రామీణాభివృద్ధి శాఖకు 2, ఎస్సీ కార్పొరేషన్ మరియు సంక్షేమ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు.

వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను ఆలస్యం చేయకుండా పరిశీలించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచే వేదికగా నిలవాలని, ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జయమ్మ, జెడ్పీ సీఈఓ శోభ రాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News