చిట్యాల, ఫిబ్రవరి 4:
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన సిలువేరు వెంకటేశం (35) అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని ఈ విషాద ఘటన తీవ్రంగా కుదిపివేసింది. గ్రామంలో శోకసంద్రం నెలకొంది.ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు, పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.వారి వెంట ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యుడు కురు యాదయ్య, సాకల నాగరాజు, ఏర్పు నరసింహ, ఆనగంటి నరేష్ తదితర నాయకులు పాల్గొని మృతుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వెంకటేశం మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి